Champions Trophy 2025: మేం చాలా మంచోళ్లం బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం: షోయబ్ మాలిక్
- పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ
- షెడ్యూల్ను ఐసీసీకి పంపిన పాక్
- భారత్ రావాలని కోరుతున్న పాక్ మాజీ ప్లేయర్స్
Shoaib Malik Feels Indian team should definitely come to Pakistan: 2025 ఫిబ్రవరి-మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. మొత్తం ఎనిమిది దేశాలు ఈ టోర్నీలో పాల్గొనబోతున్నాయి. టోర్నీ ప్రతిపాదిత షెడ్యూల్ను కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి అందించింది. అయితే భారత జట్టు పాకిస్తాన్కు వెళ్తుందా? లేదా? అనే విషయంపై ఇపటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు టీమిండియా పాక్కు రావాల్సిందేనని అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పట్టుబడుతోంది. అయితే పాకిస్థాన్కు వెళ్లేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు. భారత ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇచ్చే అవకాశం లేదు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్కు పంపాలని బీసీసీఐని ఒప్పించే బాధ్యతను ఐసీసీకి పీసీబీ అప్పగించింది. చర్చలు జరుగుతున్న వేళ.. భారత ఆటగాళ్లు తమ దేశానికి రావాలని పాక్ మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. ఇప్పటికే మాజీ పేసర్ షోయబ్ అక్తర్, మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిలు పాకిస్థాన్కు వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలని కొరారు. తాజాగా ఈ జాబితాలో వెటరన్ ఆటగాడు షోయబ్ మాలిక్ కూడా చేరాడు. టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ రావాల్సిందిగా టీమిండియాను షోయబ్ అభ్యర్థించాడు. తాము చాలా మంచోళ్లం అని, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అని చెప్పాడు.
Also Read
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
Also Read: Suryakumar Yadav: ఇంజిన్ మారిందంతే.. టీమిండియా రైలు మాత్రం దూసుకెళ్తూనే ఉంటుంది!
తాజాగా క్రికెట్ పాకిస్థాన్తో షోయబ్ మాలిక్ మాట్లాడుతూ… ‘దేశాల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా.. అది ప్రత్యేక సమస్య. దాన్ని విడివిడిగా పరిష్కరించుకోవాలి. క్రీడల్లోకి రాజకీయాలు రాకూడదు. గత సంవత్సరం పాకిస్తాన్ జట్టు భారతదేశానికి వెళ్లింది. ఇప్పుడు భారత జట్టు ఇక్కడకు రావడానికి ఇదే మంచి అవకాశం అని నేను భావిస్తున్నాను. భారత జట్టులో పాకిస్థాన్లో ఆడని ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. వారికి ఈ పర్యటన మంచి అవకాశం. మేము చాలా మంచి వ్యక్తులం. మంచి ఆతిథ్యం ఇస్తాం. భారత జట్టు తప్పకుండా పాకిస్థాన్కు రావాలి’ అని అన్నాడు. భద్రత, ఇతర కారణాల వల్ల టీమిండియా చాలాకాలంగా పాక్ పర్యటనకు వెళ్లడం లేదు. భారత జట్టు చివరిసారిగా 2008 ఆసియా కప్ కోసం అక్కడికి వెళ్లింది.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!