WCL 2025: మొదటి మ్యాచ్ లోనే తడపడ్డ ఇంగ్లాండ్.. 5 పరుగుల తేడాతో ఓటమి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
WCL 2025: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 టోర్నీలో మొదటి మ్యాచ్ లోనే పరాభవం తప్పలేదు. బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్ వేదికగా (శుక్రవారం) జులై 18న జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్లో పాకిస్తాన్ చాంపియన్స్ జట్టు ఇంగ్లాండ్పై 5 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ తరఫున మాజి కెప్టెన్ షాహిద్ అఫ్రీది గైర్హాజరులోనే విజయాన్ని సాధించడం విశేషం. దీనితో జూలై 20న భారత్తో జరగబోయే హైఓల్టేజ్ మ్యాచ్కు ముందు టీం ఇండియాకు గట్టి వార్నింగ్ బెల్స్ ఇచ్చినట్లు అయ్యింది.
Pakistan: పాక్ కు మండుతున్నట్టుంది.. భారత్ అమెరికాను రెచ్చగొడుతోందంటూ..
Also Read
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
- Amen : "గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు".. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ ప్రారంభంలో కాస్త తడబడినా, కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ అర్థశతకంతో నిలిచాడు. టాప్ ఆర్డర్లో కామ్రాన్ అక్మల్ (8), శర్జీల్ ఖాన్ (12), షోయబ్ మాలిక్ (1) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అయితే, హఫీజ్ 34 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. చివర్లో ఆమిర్ యామీన్ 13 బంతుల్లో 27 పరుగులు చేసి మ్యాచ్ మోమెంటాన్ని మార్చాడు. 19 ఓవర్ల వరకూ ఇంగ్లాండ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, చివరి ఓవర్లో మాత్రం పాక్ బ్యాటర్లు రెచ్చిపోయారు. జేమ్స్ విన్స్ వేసిన ఆఖరి ఓవర్లో సోహైల్ ఖాన్ మొదటి బంతికే సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత మూడో, నాలుగో బంతులలో ఆమిర్ యామీన్ రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో మొత్తం 22 పరుగులు వచ్చాయి. ఫలితంగా పాక్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 చేసింది. ఇంగ్లాండ్ తరఫున ట్రెమ్లెట్, ప్లంకెట్ చెరో రెండు వికెట్లు తీయగా, మిగతా నలుగురు బౌలర్లు ఒక్కొక్క వికెట్ చొప్పున దక్కించుకున్నారు.
Fish Venkat : హాస్యనటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
ఇక ఇంగ్లాండ్ 161 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్లు అలిస్టర్ కుక్, జేమ్స్ విన్స్ తొందరగా అవుటయ్యారు. ఫిల్ మస్టర్డ్ ఓ వైపు నిలబడినా, అతడు నెమ్మదిగా 51 బంతులు ఎదురుకొని 58 పరుగుల చేయడంతో జట్టుకు భారంగా మారింది. అలాగే ఇక ఈ ఇన్నింగ్స్ లో ఇయాన్ బెల్ 51*(35 బంతులు), కెప్టెన్ మోర్గన్ 12* పరుగులు చేయగా మొత్తంగా ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 155 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో 15 పరుగులు అవసరమైనా సాధించలేకపోయింది. పాకిస్తాన్ తరఫున రుమాన్ రైస్, సోహైల్ తన్వీర్, ఆమిర్ యామీన్ చెరో వికెట్ తీసారు. ఈ విజయంతో పాకిస్థాన్ చాంపియన్స్ జట్టు విజయం ద్వారా మంచి ప్రారంభాన్ని అందుకుంది.
తాజావార్తలు
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!