Wayanad Landslides : మృతుల సంఖ్య 340.. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wayanad Landslides : కేరళలోని వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 344కు చేరుకోగా, మరో 206 మంది గల్లంతయ్యారు. శనివారం ఐదో రోజు కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ కొనసాగుతోంది. రక్షణ దళాలు, NDRF, SDRF, పోలీసు, అగ్నిమాపక సేవ, వాలంటీర్లకు చెందిన 1,500 మంది సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్ శనివారం ఉదయం చురలమల, వెల్లరిమల, ముండకైల్, పంచిరిమడోమ్లోని నాలుగు ప్రాంతాలలో సోదాలు ప్రారంభించింది.
Read Also:Lakshya Sen: అసలెవరు ఈ లక్ష్య సేన్.. బ్యాక్ గ్రౌండ్ మాములుగా లేదుగా..
Also Read
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ఇప్పటి వరకు 152 మృతదేహాలను గుర్తించగా, 74 మందిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో 30 మంది చిన్నారులు కూడా ఉన్నారు. శిథిలాల నుంచి పెద్ద సంఖ్యలో ఛిద్రమైన శరీర భాగాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ సుమారు 100 సహాయక శిబిరాలు ఉన్నాయి. వీటిలో సుమారు 9,500 మందిని తరలించారు. జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో 84 మంది చికిత్స పొందుతున్నారు. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం నిర్వహించామని, 119 మృతదేహాలను బంధువులకు అప్పగించామని చెప్పారు. ఓ ప్రకటన ప్రకారం, 518 మంది ఆసుపత్రులలో చేరారు. వారిలో 89 మంది చికిత్స పొందుతున్నారు. కాగా, జూలై 30న ప్రారంభమైన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఇంకా 206 మంది గల్లంతయ్యారని తెలిపారు.
Read Also:Damodar Raja Narasimha: మాదిగలు ఎవరికి వ్యతిరేకం కాదు.. అందరం సమానమే..!
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో శనివారం వరుసగా ఐదో రోజు కూడా సోదాలు కొనసాగుతున్నాయి. శిథిలాలలో ఇంకా చిక్కుకున్న వ్యక్తుల కోసం వెతకడానికి 1,300 మందికి పైగా రెస్క్యూ వర్కర్లు, భారీ యంత్రాలు, అత్యాధునిక పరికరాలను మోహరించారు.122 టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్, కన్నూర్ యూనిట్కు అనుబంధంగా ఉన్న నటుడు మోహన్లాల్ శనివారం ఉదయం తన యూనిట్తో బాధిత ప్రాంతాలకు చేరుకున్నారు. మోహన్లాల్, సైనిక దుస్తులు ధరించి, ముందుగా మప్పాడిలోని బేస్ క్యాంపుకు చేరుకుని రక్షణ దళాలను కలిశారు. అనంతరం చురల్మల చేరుకుని రెస్క్యూ టీమ్తో మాట్లాడారు.
తాజావార్తలు
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?