PM Modi: పాట్నా గురుద్వారాలో సిక్కు వేషధారణతో సేవ చేసిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ పాట్నాలో పర్యటిస్తున్నారు. ఆదివారం బీహార్లో ముఖ్యమంత్రి నితీష్కుమార్తో కలిసి మోడీ రోడ్ షో నిర్వహించారు. సోమవారం పాట్నా గురుద్వారాలో తలపాగా ధరించి ప్రధాని లంగర్ సేవ చేశారు. పాట్నా సాహిబ్ గురుద్వారా.. సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ జన్మస్థలంగా గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీని నిర్మాణం 18వ శతాబ్దంలో గురుగోవింద్ సింగ్ జన్మస్థలానికి గుర్తుగా మహారాజా రంజిత్ సింగ్చే నిర్మించబడింది.
ఇది కూడా చదవండి: Madhavilatha : మాధవిలతపై ఈసీకి ఎంఐఎం ఫిర్యాదు.. కౌంటర్ ఇచ్చిన మాధవి లత
Also Read
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
బీహార్ రాజధాని పాట్నాలోని సాహిబ్ గురుద్వారాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం తలపాగా ధరించి, ఖీర్ కుండ పట్టుకుని భక్తులకు లంగర్, సామూహిక భోజనం వడ్డించారు. ఆహారం వండడానికి గురుద్వారా నిర్వహణకు కూడా ప్రధాని మోడీ సహాయం చేశారు. స్వయంగా చపాతీలు తయారు చేయడం, భక్తులకు దగ్గరుండి వండించారు.
ఇది కూడా చదవండి: Groom voted: మరికాసేపట్లో పెళ్లి.. పెళ్లి దుస్తుల్లో వచ్చి ఓటేసిన పెళ్ళికొడుకు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఆదివారం రాత్రి పాట్నాలో రోడ్షో నిర్వహించారు. పూలు, బీజేపీ చిహ్నాలతో అలంకరించిన వాహనంపై ప్రధాని మోడీ దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవిశంకర్ ప్రసాద్లతో పాటు వీధుల్లోకి వచ్చిన జనసమూహానికి ప్రధాని మోడీ అభివాదం చేశారు.
2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్ కీలకమైన రాష్ట్రం. ఒక్కడ 40 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. బీహార్ రాష్ట్రం.. లోక్సభ స్థానాలకు అతి పెద్దదిగా ఉంది. ఇక్కడ బీజేపీ, జేడీయూ ఉమ్మడిగా బరిలోకి దిగాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. సోమవారం నాల్గో విడత పోలింగ్ జరుగుతోంది. అనంతరం మే 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: “దాణా కుంభకోణంలో దోషి ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తున్నాడు”.. లాలూపై మోడీ ఫైర్..

తాజావార్తలు
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
-
Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
-
Peddi : ‘పెద్ది’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… డిలీటెడ్ సీన్లన్నీ ఇక్కడ చూడొచ్చు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!