PM Modi: “దాణా కుంభకోణంలో దోషి ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తున్నాడు”.. లాలూపై మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇటీవల ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. బీహార్లో జంగిల్ రాజ్ని తీసుకువచ్చిన వ్యక్తి, దాణా కేసులో నిందితుడైన వ్యక్తి దళితులు, వెనకబడిన వారి రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని వాదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. హాజీపూర్లో ఈ రోజు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఎన్నికలను ప్రజాస్వామ్యానికి పెద్ద పండగా అభివర్ణించిన మోడీ, ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేయాలని కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజలు కాదని, వారి సొంత ఓటు బ్యాంకు అని ఆరోపించారు. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు బుజ్జగింపులనే తమ అస్త్రాలుగా చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాణా కుంభకోణంలో దోషిగా తేలిని వ్యక్తి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతున్నాడని అన్నారు. మోడీ జీవించి ఉన్నంత కాలం రిజర్వేషన్లను దోచుకోలేరని చెప్పారు. మీరు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పేపర్లను చించేసిన కాలం పోయిందని ప్రధాని అన్నారు. అంతకుముందు మే 7వ తేదీని లాలూ మాట్లాడుతూ.. ముస్లింకోటాకు మద్దతుగా నిలిచారు. ముస్లింలకు పూర్తిగా రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.
Also Read
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- CM Vijay: సీఎం విజయ్కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
Read Also: Road Accident: కోతి వల్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల దుర్మరణం..
బీహార్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆలోచన ఆర్జేడీ, కాంగ్రెస్లకు లేదని ప్రధాని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ఓటేయడం వృథాగా అభివర్ణించారు. బీహార్ ప్రజలు మేధావులని, కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ ఓటు వేయండి అని, దేశం, మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అని ప్రధాని ఓటర్లను కోరారు. కేంద్రంలో ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వాలను నడుపుతున్నప్పుడు 10 ఏళ్లలో రూ. 35 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకుంటే, మోడీ ప్రభుత్వం దొంగల ఇంట్లో నుంచి రూ. 2250 కోట్లను స్వాధీనం చేసుకుందని చెప్పారు.
ఈ రోజుల్లో ఇండియా కూటమి ప్రతిపక్షాల రామ మందిరం గురించి నీచమైన మాటలు మాట్లాడేవారని, రామ మందిరం గురించి అవహేళన చేస్తూ మాట్లాడేవారని, చివరకు రామ మందిర ప్రారంభోత్సవాన్ని కూడా బహిష్కరించారని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ గెలిచినప్పుడే రామ్ విలాస్ పాశ్వాన్కి నివాళి లభిస్తుందని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ను గెలిపించడానికి, రామ్విలాస్ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానని ప్రధాని అన్నారు. బీహార్ లోని 40 స్థానాల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
-
PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
-
YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!