PM Modi: “దాణా కుంభకోణంలో దోషి ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తున్నాడు”.. లాలూపై మోడీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఇటీవల ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. బీహార్లో జంగిల్ రాజ్ని తీసుకువచ్చిన వ్యక్తి, దాణా కేసులో నిందితుడైన వ్యక్తి దళితులు, వెనకబడిన వారి రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని వాదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. హాజీపూర్లో ఈ రోజు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఎన్నికలను ప్రజాస్వామ్యానికి పెద్ద పండగా అభివర్ణించిన మోడీ, ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేయాలని కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజలు కాదని, వారి సొంత ఓటు బ్యాంకు అని ఆరోపించారు. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు బుజ్జగింపులనే తమ అస్త్రాలుగా చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాణా కుంభకోణంలో దోషిగా తేలిని వ్యక్తి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతున్నాడని అన్నారు. మోడీ జీవించి ఉన్నంత కాలం రిజర్వేషన్లను దోచుకోలేరని చెప్పారు. మీరు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పేపర్లను చించేసిన కాలం పోయిందని ప్రధాని అన్నారు. అంతకుముందు మే 7వ తేదీని లాలూ మాట్లాడుతూ.. ముస్లింకోటాకు మద్దతుగా నిలిచారు. ముస్లింలకు పూర్తిగా రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
Read Also: Road Accident: కోతి వల్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల దుర్మరణం..
బీహార్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆలోచన ఆర్జేడీ, కాంగ్రెస్లకు లేదని ప్రధాని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ఓటేయడం వృథాగా అభివర్ణించారు. బీహార్ ప్రజలు మేధావులని, కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ ఓటు వేయండి అని, దేశం, మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అని ప్రధాని ఓటర్లను కోరారు. కేంద్రంలో ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వాలను నడుపుతున్నప్పుడు 10 ఏళ్లలో రూ. 35 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకుంటే, మోడీ ప్రభుత్వం దొంగల ఇంట్లో నుంచి రూ. 2250 కోట్లను స్వాధీనం చేసుకుందని చెప్పారు.
ఈ రోజుల్లో ఇండియా కూటమి ప్రతిపక్షాల రామ మందిరం గురించి నీచమైన మాటలు మాట్లాడేవారని, రామ మందిరం గురించి అవహేళన చేస్తూ మాట్లాడేవారని, చివరకు రామ మందిర ప్రారంభోత్సవాన్ని కూడా బహిష్కరించారని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ గెలిచినప్పుడే రామ్ విలాస్ పాశ్వాన్కి నివాళి లభిస్తుందని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ను గెలిపించడానికి, రామ్విలాస్ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానని ప్రధాని అన్నారు. బీహార్ లోని 40 స్థానాల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్కు చిరంజీవి మెగా బర్త్డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!