PM Modi: “దాణా కుంభకోణంలో దోషి ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తున్నాడు”.. లాలూపై మోడీ ఫైర్..
PM Modi: ఇటీవల ముస్లిం రిజర్వేషన్లపై ఆర్జేడీ నేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. బీహార్లో జంగిల్ రాజ్ని తీసుకువచ్చిన వ్యక్తి, దాణా కేసులో నిందితుడైన వ్యక్తి దళితులు, వెనకబడిన వారి రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని వాదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. హాజీపూర్లో ఈ రోజు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడారు. ఎన్నికలను ప్రజాస్వామ్యానికి పెద్ద పండగా అభివర్ణించిన మోడీ, ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేయాలని కోరారు. ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజలు కాదని, వారి సొంత ఓటు బ్యాంకు అని ఆరోపించారు. ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీలు బుజ్జగింపులనే తమ అస్త్రాలుగా చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దాణా కుంభకోణంలో దోషిగా తేలిని వ్యక్తి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని అడుగుతున్నాడని అన్నారు. మోడీ జీవించి ఉన్నంత కాలం రిజర్వేషన్లను దోచుకోలేరని చెప్పారు. మీరు మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పేపర్లను చించేసిన కాలం పోయిందని ప్రధాని అన్నారు. అంతకుముందు మే 7వ తేదీని లాలూ మాట్లాడుతూ.. ముస్లింకోటాకు మద్దతుగా నిలిచారు. ముస్లింలకు పూర్తిగా రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు.
Also Read
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Read Also: Road Accident: కోతి వల్ల రోడ్డు ప్రమాదం.. ముగ్గురు బ్యాంక్ ఉద్యోగుల దుర్మరణం..
బీహార్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆలోచన ఆర్జేడీ, కాంగ్రెస్లకు లేదని ప్రధాని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ఓటేయడం వృథాగా అభివర్ణించారు. బీహార్ ప్రజలు మేధావులని, కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ ఓటు వేయండి అని, దేశం, మీ భవిష్యత్తు కోసం ఓటు వేయండి అని ప్రధాని ఓటర్లను కోరారు. కేంద్రంలో ఆర్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వాలను నడుపుతున్నప్పుడు 10 ఏళ్లలో రూ. 35 లక్షలు మాత్రమే స్వాధీనం చేసుకుంటే, మోడీ ప్రభుత్వం దొంగల ఇంట్లో నుంచి రూ. 2250 కోట్లను స్వాధీనం చేసుకుందని చెప్పారు.
ఈ రోజుల్లో ఇండియా కూటమి ప్రతిపక్షాల రామ మందిరం గురించి నీచమైన మాటలు మాట్లాడేవారని, రామ మందిరం గురించి అవహేళన చేస్తూ మాట్లాడేవారని, చివరకు రామ మందిర ప్రారంభోత్సవాన్ని కూడా బహిష్కరించారని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ గెలిచినప్పుడే రామ్ విలాస్ పాశ్వాన్కి నివాళి లభిస్తుందని అన్నారు. చిరాగ్ పాశ్వాన్ను గెలిపించడానికి, రామ్విలాస్ రుణం తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చానని ప్రధాని అన్నారు. బీహార్ లోని 40 స్థానాల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ(రామ్ విలాస్) పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!