Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Warangal Trs Leaders Key Role In Munugode Bypoll

Munugode Bypoll Warangal Trs Leaders : మునుగోడు గెలుపులో వరంగల్ గులాబీ నేతల మార్క్

Published Date :November 9, 2022 , 6:05 pm
By NTV WebDesk
Munugode Bypoll Warangal Trs Leaders : మునుగోడు గెలుపులో వరంగల్ గులాబీ నేతల మార్క్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

తెలంగాణ రాజకీయాల్లో కీలకమార్పునకు, బీఆర్ఎస్ పార్టీగా మారనున్న టీఆర్ఎస్ పార్టీకి పునాదిరాయిగా భావించిన మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ జెండా రెపరెపలాడింది. మునుగోడు ఉప ఎన్నికల్లో వరంగల్ జిల్లా టిఆర్ఎస్ నేతలు మార్కు ప్రదర్శించారు. బాధ్యతలు చేపట్టిన ప్రతిచోట లీడ్ లో దక్కించుకొని అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పల్లా రాజేశ్వర్ రెడ్డి తమదైన మార్క్ చూపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ ను నింపింది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు ఇలా చాలా మంది నేతలంతా మునుగోడులో ప్రచారం నిర్వహించారు. అధిష్ఠానం వారికి ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించి తమ మార్కు చూపించారు. వరంగల్ జిల్లాలో నేతలు ఇన్చార్జిగా వ్యవహరించిన గ్రామాల్లో పార్టీకి మెజార్టీని తీసుకొచ్చి తమ సత్తా చాటారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్, బీజేపీ నేతలు హెూరా హోరీగా తలపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ నేతలంతా మునుగోడులోనే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్య వతి రాథోడ్ లతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, కార్పొరేషన్ చైర్మెన్లందరూ మునుగోడు లోనే బస చేసి పార్టీ గెలుపునకు అహరహం కృషి చేశారు. ఆద్యంతం రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. కౌంటింగ్లోనూ ఈ ఉత్కంఠ కొనసాగింది. చివరకు 10 వేల పైచిలుకు మెజార్టీతో టీఆర్ఎస్ విజయం సాధించడంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.

Also Read

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Add as a preferred
source on google

Read Also: Munugode MLA : రేపే ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

తమ అధినేత ఇచ్చిన బాధ్యత ఎంత మేర పూర్తి చేశారో చెక్ చేస్తే వరంగల్ జిల్లా నేతల మార్క్ స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మరో సారి తన సత్తా చాటారు.. తనకు బాధ్యత ఇచ్చిన గ్రామంలో 1000 ఓట్లకు వన్ సైడ్ టిఆర్ఎస్‌కు ఓట్లు పడేలా చేసి 457 ఓట్ల మెజారిని సాధించి తన మార్కు మరో సారి చాటుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర్ రెడ్డి.. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇన్ ఛార్జిగా వ్యవహరించిన గ్రామాల్లో టీఆర్ఎస్ మెజార్టీ సాధించడంతో హర్షం వ్యక్తం అవుతోంది.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రులతోపాటు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, శంకర్నాయక్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టి. రాజయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తదితరులు వివిధ గ్రామాలకు ఇన్చార్జిలుగా వ్యవహరించారు. ఆయా గ్రామాల్లోనే మకాం వేసి పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు ఏ బాధ్యతలు అప్పజెప్పిన సమర్థంగా నిర్వహిస్తారనే పేరు ఉంది 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన స్వగ్రామం నుంచి 90% ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి పడేలా చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ఎమ్మెల్సీ పోటి చేసిన ఆయన సత్తా చాటారు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 90 శాతం ఓట్లు వన్ సైడ్ సాధించి తిరుగులేని మెజార్టీతో విజయం సాధించారు.

Read Also: Bhatti Vikramarka Speech At Kotideepotsavam: కోటిదీపోత్సవం.. అద్భుతం అన్న భట్టి విక్రమార్క

మునుగోడు ఉప ఎన్నికల్లోను ఇదే సత్తా చాటారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన ఇంఛార్జిగా వ్యవహరించిన గ్రామంలో వెయ్యి ఓట్లకుగాను 80 శాతం ఓట్లు టీఆర్ఎస్ కే పడేలా చేసి 457 ఓట్ల మెజార్టీని సాధించి నియోజకవర్గంలోనే టాప్ లో నిలిచారు. ఒకే గ్రామంలో 457 ఓట్ల మెజార్టీ సాధించిన ఘనత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి దక్కింది.. రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన పొర్లగడ్డతండా ఎంపిటిసి పరిధిలో టిఆర్ఎస్ 288 ఓట్ల మెజార్టీ లభించింది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించిన గ్రామంలో 166 ఓట్ల మెజార్టీ సాధించడం గమనార్హం.

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన పల్లగుట్ట తండాలో టిఆర్ఎస్ కు 151 ఓట్ల లీడ్ను సాధించారు. 105వ బూత్లో టిఆర్ఎస్కు 265, బిజెపికి 251, 106వ బూత్లో టిఆర్ఎస్కు 120, బిజెపికి 123, 107వ బూత్లో టిఆర్ఎస్ 353, బిజెపికి 213, మొత్తంగా ఈ గ్రామంలో టిఆర్ఎస్కు 738, బిజెపికి 587 ఓట్లు పోలయ్యాయి. టిఆర్ఎస్ కు 151 ఓట్ల ఆధిక్యత వచ్చింది. దీంతో శంకర్ నాయక్, అనుచరులు ఆనందంలో మునిగితేలారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించిన పలివెలలో బిజెపికి 400 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఈ గ్రామం బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అత్తగారి ఊరు కావడం గమనార్హం. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు..అరూరి రమేష్.. వినయ్ భాస్కర్ లు ఇన్ఛార్జిగా వ్యవహరించిన చండూర్ మున్సిపాలిటీ లోటిఆర్ఎస్ కి మంచి మెజార్టీ వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు జోరుకి వరంగల్ నేతల స్ట్రాటజీ కారణం అంటున్నారు. మొత్తం మీద వరంగల్ టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారంటున్నారు.
(వరంగల్ ప్రతినిధి అరుణ్ కుమార్ సౌజన్యంతో)

Read Also: Tulasi: ఆలీ పెద్ద కంత్రీ.. నిక్కర్ బటన్ పెట్టుకోలేదని చెప్తే అలా చేశాడు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • Dasyam VinayBhaskar
  • ktr
  • munugode bypoll
  • Munugode victory

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions