Elections: మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోరు.. ప్రారంభమైన పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assembly Elections: హై-వోల్టేజ్ ప్రచారాల తర్వాత, రెండు కీలక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్లలో ఎన్నికల పోరు తుదిదశకు చేరుకుంది. ఎందుకంటే ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని సోమవారం నిర్ణయిస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మేఘాలయలో 10.99 లక్షల మంది మహిళలు, 10.68 లక్షల మంది పురుషులతో సహా 21 లక్షల (21,75,236) మంది ఓటర్లు 369 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. రాష్ట్రంలో దాదాపు 81,000 మంది మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 3,419 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. మేఘాలయలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 ఖాసీ, జైంతియా హిల్స్ ప్రాంతంలో ఉండగా, 24 గారో హిల్స్ ప్రాంతంలో ఉన్నాయి.
60 నియోజకవర్గాలకు గానూ 369 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 36 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 44 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. తిరిగి అధికారంలోకి రావాలని అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) చూస్తోంది. 60 స్థానాలున్న మేఘాలయ శాసనసభ ప్రస్తుత పదవీకాలం మార్చి 15తో ముగియనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ 31. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి 19 సీట్లు, కాంగ్రెస్కు 21 సీట్లు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు సీట్లు గెలుచుకోగలిగింది. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) ఆరు స్థానాలను కైవసం చేసుకుంది.కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ యూడీపీ, బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్పీపీ నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (MDA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈసారి బీజేపీ, ఎన్పీపీ ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగా ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లు అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. 2021లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల తర్వాత మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC), ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా దాని ఆ పార్టీలో చేరిన తర్వాత బలీయమైన శక్తిగా మారింది. టీఎంసీ 58 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా దక్షిణ తురా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా, ఎన్పీపీ అధినేతపై బీజేపీ బెర్నార్డ్ ఎన్ మారక్ను రంగంలోకి దించింది. దాదేంగ్రేలో కాంగ్రెస్ అభ్యర్థి చెస్టర్ఫీల్డ్ సంగ్మా ఎన్పీపీ అభ్యర్థి జేమ్స్ సంగ్మాపై పోటీ చేస్తున్నారు.
Read Also: Minister KTR: మనీష్ సిసోడియా అరెస్టు అప్రజాస్వామికం.. కేటీఆర్ ఫైర్
మాజీ సీఎం ముకుల్ సంగ్మా తృణమూల్ టికెట్పై తిక్రికిల్లా, సాంగ్సాక్ అనే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మైరాంగ్ నుంచి యూడీపీ నేత మెత్బా లింగ్డో పోటీ చేస్తున్నారు. ఇంకా ఎన్పీపీ పైనుర్సులా నియోజకవర్గం నుంచి ప్రిస్టోన్ టిన్సోంగ్ని ఎంపిక చేసింది. సోహ్రా నుంచి యూడీపీ అభ్యర్థి టిటోస్టార్ వెల్ చైన్ పోటీ చేస్తున్నారు.టీఎంసీ నోంగ్తిమ్మాయి నుంచి చార్లెస్ పింగ్రోప్ను పోటీకి దింపింది. సౌత్ షిల్లాంగ్లో సాన్బోర్ షుల్లై, పశ్చిమ షిల్లాంగ్లో ఎర్నెస్ట్ మావ్రీని బీజేపీ పోటీకి దించింది. యూడీపీ నాయకుడు లహ్క్మెన్ రింబుయ్ అమలారం నుండి పోటీ చేస్తున్నారు. సుత్ంగా సైపుంగ్లో కాంగ్రెస్ విన్సెంట్ హెచ్ పాలను బరిలోకి దింపింది. యూడీపీ అభ్యర్థి కిర్మెన్ షిల్లా ఖలీహ్రియత్ నుంచి పోటీ చేస్తున్నారు. మేఘాలయలో ఎన్పీపీ, బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. ఎన్నికల వాగ్దానాలు, నినాదాలతో ఓ ఒక్క పార్టీ కూడా వెనకడుగు వేయలేదు. మేఘాలయలో 119 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) ఎన్నికల సంఘం మోహరించింది. మేఘాలయ ప్రధాన ఎన్నికల అధికారి ఎఫ్ఆర్ ఖార్కోంగోర్ మాట్లాడుతూ.. 640 పోలింగ్ స్టేషన్లు ‘బలహీనమైనవి’గా గుర్తించబడ్డాయి, 323 క్లిష్టమైనవిగా గుర్తించామన్నారు.
Read Also: Sidhu Moose Wala: పంజాబ్ జైలులో ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితులు హతం
నాగాలాండ్లో కాంగ్రెస్ అభ్యర్థి తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవడంతో పార్టీ అభ్యర్థి కజెటో కినిమి అకులుటో స్థానం నుండి పోటీ లేకుండా గెలుపొందడంతో ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీజేపీ ఇప్పటికే తన ఖాతా తెరిచింది. ఖేకాషే సుమీ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 183 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్ర ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 20 మంది బీజేపీ, సీపీఐ (1), కాంగ్రెస్ (23), ఎన్సీపీ (12), ఎన్పీపీ (12), ఎన్డీపీపీ (40), ఎన్పీఎఫ్ (22), ఆర్పీపీ (1), జేడీయూ 7 స్థానాల్లో పోటీ చేస్తు్న్నారు. ఎల్జేపీ(15), ఆర్పీఐ (9), ఆర్జేడీ (3), 13 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈసారి పోటీలో ఉన్న 183 మంది అభ్యర్థుల్లో కేవలం నలుగురే మహిళలని పేర్కొనడం గమనార్హం. ఇది 1963లో స్థాపించబడినప్పటి నుండి నాగాలాండ్ రాష్ట్రం 14 అసెంబ్లీ ఎన్నికలను చూసింది. కానీ ఎప్పుడూ ఒక మహిళా ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారని సమాచారం.
మొత్తం 13,17,632 మంది ఓటర్లు కాగా.. వీరిలో 6,61,489 మంది పురుషులు, 6,56,143 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకుని రాజకీయ పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించడానికి, 60 మంది సభ్యుల నాగాలాండ్ శాసనసభకు తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 2న జరగనుంది.
తాజావార్తలు
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!