Sidhu Moose Wala: పంజాబ్ జైలులో ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హత్యకేసు నిందితులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sidhu Moose Wala: పంజాబ్లోని తరన్ తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్స్టర్లు మరణించారని పోలీసులు తెలిపారు. గత ఏడాది గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో ఇద్దరికీ సంబంధం ఉందని వారు తెలిపారు. వారు ఇతర కేసులు కూడా ఎదుర్కొంటున్నారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుర్మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఈ ఘర్షణలో ఒక ఖైదీ గాయపడ్డాడని తెలిపారు. ముగ్గురూ ఒకే వర్గానికి చెందినవారు అని చౌహాన్ తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్యకేసులో నిందితులుగా ఉన్న మన్దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్ల మధ్య తరన్ తరణ్ జిల్లాలోని జైలులో ఆదివారం సాయంత్రం గొడవ జరిగింది. గ్యాంగ్స్టర్స్ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్లు మన్దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్ మృతి చెందగా.. మరో గ్యాంగ్స్టర్ కేశవ్కు తీవ్రంగా గాయాలయ్యాయి. పంజాబ్లోని తరణ్ జైలులో ఉన్న నిందితుల మధ్య ఘర్షణ ఎందుకు తలెత్తిందనేది గమనార్హం.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
Read Also: Drag Horror: లారీ బీభత్సం.. స్కూటీని 2కి.మీ ఈడ్చుకెళ్లడంతో తాత, మనవడు మృతి
సిద్ధూ మూసేవాలాగా ప్రసిద్ధి చెందిన శుభదీప్ సింగ్ సిద్ధూ మే 29న మాన్సా జిల్లాలో కాల్చి చంపబడ్డాడు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సతీందర్జిత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ సిద్ధూ హత్యకు తానే కారణమని అంగీకరించాడు. మూసేవాలాను హత్య చేసిన కేసులో నిందితులైన మన్దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్లు గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఉన్నారు. జైలులో గ్యాంగ్ వార్ జరగడంతో ఇద్దరు నిందితులు చనిపోగా, తీవ్రంగా గాయపడిన కేశవ్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!