Prakasam Tension: దర్శి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల మధ్య వివాదం.. కింద పడిపోయిన ఈవీఎం!
AP Elections 2024: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని బొట్లపాలెంలో పోలింగ్ పునః ప్రారంభమైంది. అయితే, పోలింగ్ కేంద్రంలో ఓటర్ల మధ్య వివాదంతో తోపులాట స్టార్ట్ అయింది. దీంతో ఈవీఎం మిషన్లు కింద పడిపోయాయి. ఇక, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటింగ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘర్షణకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, విషయం తెలుసుకుని పోలింగ్ కేంద్రం దగ్గరకు దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి చేరుకున్నారు.
Read Also: Lok Sabha Elections 2024 : తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్
Also Read
అయితే, తమ ఏజెంట్లను వైసీపీ ఏజెంట్లు బయటకు వెళ్ళమని చెప్పడంతోనే ఘర్షణకు దిగారని టీడీపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ ఆరోపించారు. దీంతో కాసేపు ఎన్నికల అధికారులు పోలింగ్ నిలిపి వేశారు. దీనికి నిరసనగా టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. అలాగే, విషయం పెద్దది కావడంతో రెండు వైపులా ఇరు పార్టీలకు చెందిన నేతలు మోహరించారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం యధావిధిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
KaruppuAudioLaunch : ఏకంగా 73 సినిమాలకు మ్యూజిక్ చేస్తున్న యంగ్ సెన్సేషన్
-
Mohsin Khan: మోసిన్ ఖాన్ సంచలనం.. కేకేఆర్పై విరుచుకుపడి 5 వికెట్ల హాల్తో సరికొత్త రికార్డులు
-
Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?
-
Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!