Fake IAS: నకిలీ ఐఏఎస్ అధికారిణిని గుర్తించాం.. కఠిన చర్యలు తీసుకుంటాం: విశాఖ సీపీ
- ఉత్తరాంధ్రలో నకిలీఐఏఎస్ల భాగోతాలు కలకలం
- ట్రైని ఐఏఎస్ అధికారిని అంటూ అమృత హంగామా
- ముమ్మురంగా గాలింపు చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్రలో నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ల భాగోతాలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి ఘటన మరువక ముందే.. మరో కిలాడి లేడీ తానో ట్రైని ఐఏఎస్ అధికారిని అంటూ హంగామా చేసింది. అంతేకాక తాను రాజకీయ నాయకుల బంధువునని కటింగ్లు కొట్టింది. నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఆగడాలతో పోలీసు వర్గాలకు టెన్షన్ పట్టుకుంది. అమృత భాగ్య రేఖ అనే మహిళ తన భర్తతో అనేక మోసాలకు పాల్పడుతున్నట్టు విశాఖపట్నం పోలీసులు గుర్తించారు.
నకిలీ ఐఏఎస్గా చెప్పుకుంటూ తిరుగుతున్న కిలాడి లేడీ కోసం విశాఖపట్నం పోలీసులు గాలిస్తున్నారు. డీసీపీ ఆధ్వర్యంలో మూడు బృందాలు ఆమె కోసం ఉత్తరాంధ్రలో ముమ్మురంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఈమె అనేక ఆర్థిక మోసాలకు పాల్పడినట్టు గుర్తించామని విశాఖ సీపీ శంఖ భ్రత బాగ్చి తెలిపారు. ఇప్పటికే ఈమె బారిన పడిన ఇద్దరు బాధితులను గుర్తించామని, ఇంకా చాలా మంది మోసపోయినట్లు గుర్తించామని తెలిపారు. అయితే ఈమె వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
ఎన్టీవీతో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ… ‘విశాఖలో నకిలీ ఐఏఎస్ అధికారిణిగా చలామణి అవుతున్న మహిళను గుర్తించాం. అమృత భాగ్య రేఖ అనే మహిళ, ఆమె భర్త తో కలిసి మోసాలు చేసినట్టు సమాచారం వచ్చింది. ఇప్పటికే ఇద్దరు బాధితులను గుర్తించాం. విశాఖతో పాటు ఉత్తరాంధ్రలో పలు మోసాలు చేసినట్టు గుర్తించాం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. డీసీపీ ఆధ్వర్యంలో మూడు బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. ఈమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!