Virat Kohli: ఫీల్డ్లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని.. వీడియో వైరల్
- రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ Dలో భాగంగా రైల్వేస్, ఢిల్లీ మ్యాచ్ మ్యాచ్.
- ప్రేక్షకులతో నిండిపోయిన స్టేడియం.
- 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.
- ఫీల్డ్లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని..
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024-25 ఎలైట్ గ్రూప్ D మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రైల్వేస్తో ఆడుతున్నాడు. 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఢిల్లీ స్టేడియంకు చేరుకున్నారు. జనవరి 30, మొదటి రోజు ఆట ఉదయం సెషన్లో ఒక అభిమాని భద్రతా వలయాన్ని దాటుకొని మైదానం మధ్యలోకి చేరుకుని విరాట్ కోహ్లీ పాదాలను తాకాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Wriddhiman Saha: క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడనున్న వృద్ధిమాన్ సాహా
Also Read
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
- Tamim Iqbal: 37 ఏళ్లకే చరిత్ర సృష్టించిన మాజీ కెప్టెన్.. దేశ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం.!
- India Meet విభేదాల మధ్య ‘ఉమ్మడి పోరు’కు సిద్ధమైన 'ఇండియా కూటమి'.. నేడు కీలక సమావేశం.!
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అనేక వీడియోలలో అభిమాని స్లిప్ల వైపు పరిగెత్తడం, విరాట్ పాదాలను తాకడం చూడవచ్చు. ఘటన జరిగిన వెంటనే, అభిమానిని భద్రతా అధికారులు పట్టుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోను గమనించినట్లయితే, కోహ్లి అభిమానిని కొట్టవద్దని భద్రతా అధికారులను అభ్యర్థిస్తున్నట్లు చూడవచ్చు. నవంబర్ 2012 తర్వాత కోహ్లీ ఆడనున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ కావడంతో గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 15,000 మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. DDCA (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్) కోహ్లీ ఆడుతుండడంతో దాదాపు 10,000 మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేసింది. అయితే, కోహ్లి క్రేజ్ ఎంతగా ఉందంటే తెల్లవారుజామున 3 గంటల నుంచే స్టేడియం బయట జనం గుమిగూడారు. దాదాపు 15 వేల మంది స్టేడియం లోపల ఉంటారని, అలాగే దాదాపు అంతే మొత్తంలో స్టేడియం బయట కూడా ఉంటారని సమాచారం.
Also Read: GHMC Council Meeting: బడ్జెట్ ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ మేయర్.. కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం!
ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బడోని టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నందున విరాట్ కోహ్లీ జట్టు మొదట ఫీల్డింగ్ చేస్తోంది. దీనితో కోహ్లి రేపు మైదానంలో బ్యాటింగ్కు వస్తాడని భావిస్తున్నారు. కోహ్లీ తన రెగ్యులర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని ఢిల్లీ కెప్టెన్ ఇప్పటికే ధృవీకరించాడు. ఇక రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ను చూస్తే..
A fan entered the ground to meet Virat Kohli & he touched Kohli's feet. 🥹❤️ pic.twitter.com/97SyZleaNv
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 30, 2025
ఢిల్లీ: సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, విరాట్ కోహ్లీ, ఆయుష్ బడోని (కెప్టెన్), ప్రణవ్ రాజ్వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, శివమ్ శర్మ, నవదీప్ సైనీ, మణి గ్రేవాల్ మరియు సిద్ధాంత్ శర్మ.
రైల్వేస్: అంచిత్ యాదవ్, వివేక్ సింగ్, మహ్మద్ సైఫ్, సూరజ్ అహుజా (కెప్టెన్), ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), భార్గవ్ మెరాయ్, కర్ణ్ శర్మ, అయాన్ చౌదరి, హిమాన్షు సాంగ్వాన్, కునాల్ యాదవ్ మరియు రాహుల్ శర్మ.
తాజావార్తలు
-
Peddi Monday Test : ఈ రోజు నుండి ‘పెద్ది’కి అసలైన ఆట మొదలు
-
Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!… ఈ వారమే ఓటీటీలోకి సూర్య ‘కరుప్పు’
-
IND vs AFG Test: షాకింగ్.. మూఢనమ్మకంతో స్టేడియం నుంచి వెళ్లిపోయిన టీమిండియా క్రికెటర్ ఫ్యామిలీ!
-
Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
-
MS Subbulakshmi Biopic : లెజెండరీ సింగర్ బయోపిక్ లో రష్మిక… సాయి పల్లవి చేజారినట్టే ?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!