Virat Kohli: ఫీల్డ్లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని.. వీడియో వైరల్
- రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ Dలో భాగంగా రైల్వేస్, ఢిల్లీ మ్యాచ్ మ్యాచ్.
- ప్రేక్షకులతో నిండిపోయిన స్టేడియం.
- 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.
- ఫీల్డ్లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని..
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024-25 ఎలైట్ గ్రూప్ D మ్యాచ్లో భారత స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ రైల్వేస్తో ఆడుతున్నాడు. 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఢిల్లీ స్టేడియంకు చేరుకున్నారు. జనవరి 30, మొదటి రోజు ఆట ఉదయం సెషన్లో ఒక అభిమాని భద్రతా వలయాన్ని దాటుకొని మైదానం మధ్యలోకి చేరుకుని విరాట్ కోహ్లీ పాదాలను తాకాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Wriddhiman Saha: క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడనున్న వృద్ధిమాన్ సాహా
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న అనేక వీడియోలలో అభిమాని స్లిప్ల వైపు పరిగెత్తడం, విరాట్ పాదాలను తాకడం చూడవచ్చు. ఘటన జరిగిన వెంటనే, అభిమానిని భద్రతా అధికారులు పట్టుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోను గమనించినట్లయితే, కోహ్లి అభిమానిని కొట్టవద్దని భద్రతా అధికారులను అభ్యర్థిస్తున్నట్లు చూడవచ్చు. నవంబర్ 2012 తర్వాత కోహ్లీ ఆడనున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ కావడంతో గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 15,000 మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. DDCA (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్) కోహ్లీ ఆడుతుండడంతో దాదాపు 10,000 మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేసింది. అయితే, కోహ్లి క్రేజ్ ఎంతగా ఉందంటే తెల్లవారుజామున 3 గంటల నుంచే స్టేడియం బయట జనం గుమిగూడారు. దాదాపు 15 వేల మంది స్టేడియం లోపల ఉంటారని, అలాగే దాదాపు అంతే మొత్తంలో స్టేడియం బయట కూడా ఉంటారని సమాచారం.
Also Read: GHMC Council Meeting: బడ్జెట్ ప్రవేశపెట్టిన జీహెచ్ఎంసీ మేయర్.. కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం!
ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బడోని టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నందున విరాట్ కోహ్లీ జట్టు మొదట ఫీల్డింగ్ చేస్తోంది. దీనితో కోహ్లి రేపు మైదానంలో బ్యాటింగ్కు వస్తాడని భావిస్తున్నారు. కోహ్లీ తన రెగ్యులర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని ఢిల్లీ కెప్టెన్ ఇప్పటికే ధృవీకరించాడు. ఇక రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ను చూస్తే..
A fan entered the ground to meet Virat Kohli & he touched Kohli's feet. 🥹❤️ pic.twitter.com/97SyZleaNv
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 30, 2025
ఢిల్లీ: సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, విరాట్ కోహ్లీ, ఆయుష్ బడోని (కెప్టెన్), ప్రణవ్ రాజ్వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, శివమ్ శర్మ, నవదీప్ సైనీ, మణి గ్రేవాల్ మరియు సిద్ధాంత్ శర్మ.
రైల్వేస్: అంచిత్ యాదవ్, వివేక్ సింగ్, మహ్మద్ సైఫ్, సూరజ్ అహుజా (కెప్టెన్), ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), భార్గవ్ మెరాయ్, కర్ణ్ శర్మ, అయాన్ చౌదరి, హిమాన్షు సాంగ్వాన్, కునాల్ యాదవ్ మరియు రాహుల్ శర్మ.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!