T20 World Cup: టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లీకి గాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్తో సెమీ ఫైనల్ మ్యాచ్కు ముందు టీమిండియాను గాయాలు భయపెడుతున్నాయి. ప్రాక్టీస్ సెషన్లో భారత కీలక ఆటగాళ్లు గాయపడ్డారనే వార్తలు క్రికెట్ అభిమానులను కంగారుపెడుతున్నాయి. మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ గాయపడగా.. ఇవాళ విరాట్ కోహ్లీకి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. అడిలైడ్ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంటోంది. రేపు జరగనున్న సెమీస్ మ్యాచ్ దృష్టా సన్నద్ధమవుతున్నారు. మంగళవారం రోహిత్ గాయపడ్డాడనే వార్త నెట్టింట తెగ వైరల్ కాగా.. ఆ గాయం పెద్దదేమీ కాదని, అతను మ్యాచ్ ఆడతాడని భారత జట్టు వెల్లడించింది.
Rashmika Serious On Trollers: ట్రోలర్స్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ రష్మిక
Also Read
ఇదిలా ఉండగా.. బుధవారం ప్రాక్టీస్ సెషన్స్లో విరాట్ కోహ్లీ గాయపడ్డారనే వార్త అభిమానులను భయాందోళనకు గురి చేసింది. బుధవారం ప్రాక్టీస్లో భాగంగా హర్షల్ పటేల్ బౌలింగ్లో ప్రాక్టీస్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ సమయంలో ఓ బౌన్సర్ విరాట్ కోహ్లీ చేతికి బలంగా తాకిందని సమాచారం. నొప్పితో కాసేపు విలవిలలాడిన కోహ్లీ, ప్రాక్టీస్ సెషన్స్ నుంచి బయటికి వెళ్లాడనే వార్త అభిమానులను షాక్కి గురి చేసింది. దీంతో, కాసేపు ప్రాక్టీస్ ఆపేశాడు కింగ్ కోహ్లీ. అయితే, స్వల్ప గాయం కావడంతో.. ప్రస్తుతం కోహ్లీ ఫిట్గానే ఉన్నట్టు బీసీసీఐ అధికారులు తెలిపారు. దీంతో, టీమిండియాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వార్త విన్న అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇప్పటిదాగా జరిగిన మ్యాచుల్లో కోహ్లీ తన బ్యాట్తో అద్భుతాలే చేశాడు. కోహ్లీ సెమీస్లో ఆడడం చాలా అవసరం. 2012 టోర్నీలో చివరిసారిగా ఇంగ్లాండ్తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన టీమిండియా, 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ జట్టుతో ఆడనుంది. అయితే ఈ కీలక మ్యాచ్కి ముందు ప్రాక్టీస్ సెషన్స్లో భారత ప్లేయర్లు గాయపడుతున్నారనే వార్తలు అభిమానులను కలవర పెడుతున్నాయి.
తాజావార్తలు
-
Amba: టాలీవుడ్లో పూర్తి స్థాయి AI మూవీగా ‘అంబ’s రివెంజ్’
-
Kalki Sequel: ‘కల్కి 2’ నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
-
KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
-
EPFO: ఖాతాదారులకు అలర్ట్.. మళ్లీ సేవలకు బ్రేక్.. కారణమిదే!
-
Samantha vs Naga Chaitanya : సామ్ vs చై.. ఇప్పుడెందుకీ రచ్చ?
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!