Vikarabad: అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాలో ఈనెల 21న తాండూర్ మోర్ సూపర్ మార్కెట్లో షెటర్ లిఫ్ట్ చేసి దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. ఈ చోరీ కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో చేధించారు. ఈ దొంగతనంకు సంబంధించిన వివరాలను తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. అయితే, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. కర్ణాటక రాష్ట్రం కల్బురిగి జిల్లా లోని సేడం తాలూకా సాలార్ కోర్ట్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులుగా గుర్తించారు. వారు కోరుకు నవీన్, కురువ శ్రీనివాస్, సుగ్గల సంజీవ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు.
Read Also: Man Struck In Shop: మసాజ్ చైర్ లో పడుకున్న వ్యక్తికి వింత అనుభవం.. ఏం జరిగిందంటే
Also Read
- Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
అయితే, ఈ నేరం తామే చేశామని ఒప్పుకున్న నిందితుల దగ్గర నుంచి మోర్ సూపర్ మార్కెట్ కు సంబంధించిన చోరీ కేసులో లక్ష డెబ్బై వేల రూపాయలు రికవరీతో పాటు రెండు బైకులు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక, అంతరాష్ట్ర ముఠా నిందితులు ఆరు నేరాల్లో పాల్గొన్నారుని డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. కొడంగల్ లో వీరిపై మూడు దొంగతనం కేసులు.. ఓ బట్టల షాపులో బట్టల దొంగతనం, బంగారు షాపులో వెండి పాత్రలు.. మొబైల్ షాప్ లో ల్యాప్ టాప్, మొబైల్ సామాగ్రి చోరీ చేసినట్లు తాండూర్ డీఎస్పీ చెప్పుకొచ్చారు.
Read Also: Russia: రష్యా విమానం ప్రమాదం.. 10 మృతదేహాలు, ఫ్లైట్ రికార్డర్లు వెలికితీత
ఇక, కర్ణాటక రాష్ట్రం ముధోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నేరాలకు పాల్పడినట్లు తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన డబ్బా సంజీవ మరో నేరస్థున్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతను కర్ణాటకలో పలు దొంగతనాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అక్కడి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరుగుతుందని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!