Vikarabad: అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాలో ఈనెల 21న తాండూర్ మోర్ సూపర్ మార్కెట్లో షెటర్ లిఫ్ట్ చేసి దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. ఈ చోరీ కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో చేధించారు. ఈ దొంగతనంకు సంబంధించిన వివరాలను తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. అయితే, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. కర్ణాటక రాష్ట్రం కల్బురిగి జిల్లా లోని సేడం తాలూకా సాలార్ కోర్ట్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులుగా గుర్తించారు. వారు కోరుకు నవీన్, కురువ శ్రీనివాస్, సుగ్గల సంజీవ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు.
Read Also: Man Struck In Shop: మసాజ్ చైర్ లో పడుకున్న వ్యక్తికి వింత అనుభవం.. ఏం జరిగిందంటే
Also Read
అయితే, ఈ నేరం తామే చేశామని ఒప్పుకున్న నిందితుల దగ్గర నుంచి మోర్ సూపర్ మార్కెట్ కు సంబంధించిన చోరీ కేసులో లక్ష డెబ్బై వేల రూపాయలు రికవరీతో పాటు రెండు బైకులు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక, అంతరాష్ట్ర ముఠా నిందితులు ఆరు నేరాల్లో పాల్గొన్నారుని డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. కొడంగల్ లో వీరిపై మూడు దొంగతనం కేసులు.. ఓ బట్టల షాపులో బట్టల దొంగతనం, బంగారు షాపులో వెండి పాత్రలు.. మొబైల్ షాప్ లో ల్యాప్ టాప్, మొబైల్ సామాగ్రి చోరీ చేసినట్లు తాండూర్ డీఎస్పీ చెప్పుకొచ్చారు.
Read Also: Russia: రష్యా విమానం ప్రమాదం.. 10 మృతదేహాలు, ఫ్లైట్ రికార్డర్లు వెలికితీత
ఇక, కర్ణాటక రాష్ట్రం ముధోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నేరాలకు పాల్పడినట్లు తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన డబ్బా సంజీవ మరో నేరస్థున్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతను కర్ణాటకలో పలు దొంగతనాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అక్కడి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరుగుతుందని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!