Vikarabad: అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాలో ఈనెల 21న తాండూర్ మోర్ సూపర్ మార్కెట్లో షెటర్ లిఫ్ట్ చేసి దొంగతనానికి పాల్పడ్డ అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు. ఈ చోరీ కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో చేధించారు. ఈ దొంగతనంకు సంబంధించిన వివరాలను తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. అయితే, సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు.. కర్ణాటక రాష్ట్రం కల్బురిగి జిల్లా లోని సేడం తాలూకా సాలార్ కోర్ట్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులుగా గుర్తించారు. వారు కోరుకు నవీన్, కురువ శ్రీనివాస్, సుగ్గల సంజీవ అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నించారు.
Read Also: Man Struck In Shop: మసాజ్ చైర్ లో పడుకున్న వ్యక్తికి వింత అనుభవం.. ఏం జరిగిందంటే
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
- Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
అయితే, ఈ నేరం తామే చేశామని ఒప్పుకున్న నిందితుల దగ్గర నుంచి మోర్ సూపర్ మార్కెట్ కు సంబంధించిన చోరీ కేసులో లక్ష డెబ్బై వేల రూపాయలు రికవరీతో పాటు రెండు బైకులు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక, అంతరాష్ట్ర ముఠా నిందితులు ఆరు నేరాల్లో పాల్గొన్నారుని డీఎస్పీ శేఖర్ గౌడ్ అన్నారు. కొడంగల్ లో వీరిపై మూడు దొంగతనం కేసులు.. ఓ బట్టల షాపులో బట్టల దొంగతనం, బంగారు షాపులో వెండి పాత్రలు.. మొబైల్ షాప్ లో ల్యాప్ టాప్, మొబైల్ సామాగ్రి చోరీ చేసినట్లు తాండూర్ డీఎస్పీ చెప్పుకొచ్చారు.
Read Also: Russia: రష్యా విమానం ప్రమాదం.. 10 మృతదేహాలు, ఫ్లైట్ రికార్డర్లు వెలికితీత
ఇక, కర్ణాటక రాష్ట్రం ముధోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నేరాలకు పాల్పడినట్లు తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన డబ్బా సంజీవ మరో నేరస్థున్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందని అతను కర్ణాటకలో పలు దొంగతనాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను అక్కడి పోలీస్ స్టేషన్ లో అప్పగించడం జరుగుతుందని తాండూర్ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
DMK: స్టాలిన్కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్బై
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!