Attack on CM Jagan Incident: కొంత మందిపై అనుమానం ఉంది.. అక్కడి నుంచే రాయి విసిరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on CM Jagan Incident: సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి ఘటనలో కీలక విషయాలు ప్రస్తావించారు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా.. బెజవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బెజవాడ పరిధిలో 22 కిలో మీటర్ల జగన్ రోడ్ షో చేశారు. 1,480 సిబ్బంది జగన్ రోడ్ షోలో బందోబస్తు కోసం పాల్గొన్నారు. 400 మందితో 40 రోప్ పార్టీలు పెట్టాయి. ఏపీఎస్పీ నుంచి నాలుగు ప్లాటూన్లు వచ్చాయి. ఇదే కాకుండా సీఎం వ్యక్తిగత భద్రతా సిబ్బంది.. అక్టోపస్ భద్రతా ఉంది. జనసమ్మర్థమైన ప్రాంతాల్లో రోడ్ షో జరిగింది. రకరకాల కేబుల్స్ అడ్డంకిగా ఉన్నాయి. దీంతో కొన్ని తొలగించాల్సి వచ్చిందన్నారు.. బస్ రూఫ్ మీద ఎక్కుతారు కాబట్టి.. పవర్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. ఏ వీఐపీ కార్యక్రమమైనా.. రూఫ్ ఎక్కితే పవర్ ఆపాల్సిందే అన్నారు. అయితే, వివేకానంద స్కూల్ – గంగానమ్మ గుడి ప్రాంతానికి చేరుకున్న సందర్భంలో ఓ వ్యక్తి రాయి విసిరాడు అని వెల్లడించారు.
Read Also: Chandrababu: రాష్ట్రానికి నేనే డ్రైవర్.. ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
- Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
- ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
- US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
ఇక, సీసీ కెమెరాల నుంచి.. సెల్ ఫోన్ విజువల్స్ నుంచి మేం సేకరించిన సమాచారం మేరకి రాయి విసిరారని నిర్ధారణకు వచ్చామని తెలిపారు సీపీ కాంతా రాణా.. సీసీ టీవీ ఫుటేజ్, విజువల్స్ ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపాం అన్నారు. సీఎంపై దాడి ఘటనలో ఎనిమిది ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపడుతున్నాం అన్నారు. ఇప్పటికే 52 మందిని ప్రశ్నించాం.. కొంత మందిపై అనుమానం ఉందన్నారు. అయితే, చీకట్లో రాయి విసిరిన వ్యక్తిని కనుక్కోవడం ఈజీ టాస్క్ కాదు. కానీ, త్వరలో కనుగొనే ప్రయత్నం చేస్తాం అన్నారు. స్కూల్, గంగానమ్మ గుడి మధ్య నించొనే రాయి విసిరారు.. కంప్లైంటును బేస్ చేసుకుని.. కేసు సీరియస్ నెస్ ను దృష్టిలో పెట్టుకునే హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.
Read Also: Mamata Banerjee: బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలు ఉండవు..
సీఎం జగన్కు తగలరాని చోట తగిలితే పెద్ద ప్రమాదమే జరిగేదన్నారు విజయవాడ సీపీ.. సీఎం జగన్పై దాడి చేసిన నిందితులను పట్టుకొవడంలో ప్రజలు దోహదపడాలని విజ్ఞప్తి చేశారు. ఖచ్చితమైన సమాచారాన్ని దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించవచ్చు అన్నారు. ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారం ఇవ్వొచ్చు అని సూచించారు. కేసుకు దోహదపడే సమాచారం అందించిన వారికి రూ. 2 లక్షల నగదును బహుమతి ఇస్తాం అని ప్రకటించారు. సమాచారాన్ని అందించిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతా..
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..