YCP: గవర్నర్ను కలిసిన వైసీపీ నేతల బృందం.. పలు అంశాలపై ఫిర్యాదు
- గవర్నర్ను కలిసిన వైసీపీ నేతల బృందం
- రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు..,
- వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్కు ఫిర్యాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేవ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ను వైసీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనలు, అక్రమ కేసులు, వ్యవస్థల నిర్వీర్యంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ను కలిసిన వారిలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు విడదల రజినీ.. వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. గవర్నర్ను కలిసిన అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైసీపీ బృందం అబ్దుల్ నజీర్ను కలిశామని తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడాలని కోరాం.. రాజ్యాంగాన్ని మీ ప్రభుత్వంలో అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరామని పేర్కొన్నారు. సీఎంగా ఉండి గంగాధర నెల్లూరులో మాట్లాడిన మాటలు అందరూ చూశారు.. ఎవరైనా లబ్ధిదారులకు పార్టీలు, వర్గాలు ఉండవని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం అర్హులైతే పథకాలు అందటం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు.
Read Also: Fish bite: చేప కాటు వల్ల ప్రాణాంతక ఇన్ఫెక్షన్.. చేయిని కోల్పోయిన రైతు..
Also Read
- CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు 'రెడ్ అలర్ట్' జారీ!.
- Andhra Pradesh : ఏపీకి కేంద్రం భారీ నజరానా.. రూ.1,990 కోట్ల అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.!
- CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు.. దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చాక ఈ రకమైన పదాలతో ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడలేదని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. పార్టీ విధానాల ప్రకారం గత ముఖ్యమంత్రులు పనిచేశారు.. అధికార, ప్రతిపక్షాలు ఎవరి పాత్ర వారు పోషిస్తారన్నారు. ఇది వ్యక్తిగత వివాదాలు కాదు.. ఆస్తి తగాదాలు కాదని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు ఇలా మాట్లాడటం దురదృష్టకరం అని అన్నారు. పేదవాళ్ళకు పార్టీలు అంటగట్టి మాట్లాడటం ధర్మమా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా తమ పాత్ర తాము పోషిస్తున్నామని చెప్పారు. ప్రజల కోసం తమ సిద్ధాంతాల కోసం పోరాడతామని తెలిపారు. ప్రతీరోజూ వైసీపీ కార్యకర్తలు, జర్నలిస్టులపై కూడా అక్రమ కేసులు పెడుతున్నారు.. అన్ని విషయాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Read Also: Vangalapudi Anitha: మహిళా ఎస్సై పట్ల ఆకతాయిల దాడి.. హోంమంత్రి ఆగ్రహం
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!