Vijayasai Reddy : దేశంలో ఒరిజినల్ బీజేపీ ఉండగా.. రాష్ట్రంలో మరో బీజేపీ ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహించామన్నారు వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ విజయ్ సాయి రెడ్డి. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలను నేతలు.. కార్యకర్తలు ప్రస్తావించారన్నారు. గతంలో ఎన్నడూ లేనంత విధంగా.. ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా పరిష్కరించి నేతలు కార్యకర్తల నుంచి సమస్యలను తెలుసుకున్నామన్నారు విజయసాయిరెడ్డి. బడుగు బలహీన వర్గాలకు ఎలా సేవ చేయాలనే విషయంపై దృష్టి సారించామని, ఈ సమావేశాలు ఎన్నో సత్ఫలితాలనుచ్చాయన్నారు విజయసాయిరెడ్డి.
అంతేకాకుండా..’వచ్చే లోకసభ ఎన్నికలలో నెల్లూరు నుంచి వైసీపీ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు. కొన్ని అసెంబ్లీ సర్కిల్ సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థులను ఎంపిక చేసారు. మిగిలిన వారిని ఎంపిక చేయాల్సి ఉంది. గతంలో అందరూ చంద్రబాబుని ఎంతో నీతిమంతుడని పొగిడేవారు. రాష్ట్రంలో ఏం జరిగినా అన్ని చంద్రబాబు చెప్పారని ప్రచారం చేశారు. ప్రస్తుతం టీడీపీ తన వ్యూహాన్ని మార్చుకోంది. చంద్రబాబు ఎంత చలాగ్గా ఉన్నారని నేతలు చెప్పారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఇప్పుడు ఆయన కు ఆరోగ్యం బాగాలేదని.. చర్మ వ్యాధులు వచ్చాయని చెబుతున్నారు. ఈ వ్యూహాలను కొన్ని ఛానళ్లు..మీడియా లు ప్రచారం చేస్తున్నాయి. లోకేష్ కు అమిత్ షా నే అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. దేశంలో ఒరిజినల్ బీజేపీ ఉండగా రాష్ట్రంలో మరో బీజేపీ ఉంది. మాటల ద్వారా గెలవలేనప్పుడు కత్తులు కటార్లు పట్టుకోమని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అందుకే కోర్టులో న్యాయమూర్తుల ముందు న్యాయవాదులను బెదిరిస్తున్నారు. పురందేశ్వరిది ఎల్లో లోటస్. బీజేపీ ఒరిజినల్ లోటస్. చంద్రబాబు అవినీతిపై పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు గారు పుస్తకం వేశారు. పురంధేశ్వరి మాత్రం చంద్రబాబు అవినీతికి పాల్పడలేదని అంటున్నారు. పురందేశ్వరి చంద్రబాబు కు ఎంతకు అమ్ముడుపోయారు. బాబు అవినీతిలో మీ వాటా ఎంత.
తనకంటే మహానటుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం అంటే పురందేశ్వరి ..లోకేష్ లన కలయిక చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్ర ఉందని అన్నారు. కానీ సీఐడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసింది. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. చంద్రబాబు అవినీతిని పూర్తిగా వెలికి తీస్తాం. దీంతోపాటు అడుగు బలహీన వర్గాల వారి అభివృద్ధికి పాటుపడతాం. నెల్లూరు జిల్లాలో గతంలో పది స్థానాలకు పది గెలిచాం. కొత్త నెల్లూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం ఉన్న 8 స్థానాల్లో కూడా విజయం సాధిస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా సమస్యలు ఉన్నాయి.. కొన్ని అభిప్రాయ బేధాలు వస్తాయి.
ఒకోరి ఆలోచన ఏ విధంగా ఉంటుంది అందర్నీ కలుపుకొని పోయి. కావలి నుంచి వచ్చే ఎన్నికల్లో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారు. చిన్న సమస్యలను ఆయన పరిష్కరిస్తారు. చంద్రబాబు అవినీతి సంబంధించి అన్ని ఆధారాలను సీఐడీ సేకరించింది. ఎవర్ని విచారించాలనే విషయాన్ని ఆ విచారణ సంస్థ చూసుకుంటుంది. సీఐడీ విచారణ సక్రమంగా సాగుతోంది. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో 99 శాతం నెరవేర్చాం. దాదాపు అన్ని ఇళ్ళకు సంక్షేమ. అభివృద్ధి పథకాలను అందించాం.’ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?