Fake Tea Powder: రసాయనాలతో టీ పొడి.. రాజమండ్రి కేంద్రంగా నకిలీ గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Tea Powder: రాజమండ్రి కేంద్రంగా నకిలీ టీపొడి గుట్టు రట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. రాజమండ్రిలో జోరుగా సాగుతున్నా టీ పొడి కల్తీ షాపులపై విజిలెన్స్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. రాజమండ్రిలో కల్తీ టీపొడి తయారీ, అమ్మకాల షాపులపై విజిలెన్స్ దాడులు చేసి టీపొడిలో కలుపుతున్న నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్ స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి టౌన్ హాల్ రోడ్డులో మూడు టీ రీప్యాకింగ్ హోల్ సేల్ షాపుల్లో తనిఖీలు జరిపారు. విజిలెన్స్, రెవిన్యూ, పుడ్ సేఫ్టీ , లీగల్ మెట్రాలజీ అధికారులతో కలిసి ఈ దాడులు చేశారు. శ్రీతేజ అస్సాం టీ షాపును తనిఖీ చేయగా ఫ్యాప్పీ సర్టిఫికేట్ లేనందున ఫుడ్ ఇన్స్పెక్టర్ నోటీసులు జారీ చేశారు.. నిషేధించబడిన సింథటిక్ ఫుడ్ కలర్ టార్టాజైన్, సన్ సెట్ పసుపులను టీ పొడిలో కలపడాన్ని గుర్తించారు. టీ పౌడర్ ప్యాకెట్లలో టీపొడి నమూనాలను విశ్లేషణ కోసం సేకరించారు. టీ పొడిని కల్తీ చేయడానికి ఉపయోగిస్తున్న టార్టాజైన్ (పసుపు) సన్ సెట్ పసుపులను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Pinnelli Ramakrishna Reddy: ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుకౌట్ నోటీసులు జారీ
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
ప్యాకింగ్ లైసెన్సు లేకపోవడం, టీ పౌడర్ ప్యాకెట్లపై కన్స్యూమర్ కేర్ వివరాలు లేకపోవడంతో లీగల్ మెట్రాలజీ అధికారులు కేసు నమోదు చేశారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నట్టు గుర్తించి కేసు పెట్టారు. గ్యాస్ సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారు. టీ పొడిని కల్తీ చేయడానికి సింథటిక్ రంగులను ఉపయోగించినందుకు రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఐపీసీ 420, 272 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్కు సిఫారసు చేశారు. అలాగే రాజమండ్రి టౌన్ హాలు రోడ్డులోనే మరొకటి కీర్తి అస్సాం టీ షాపును విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీ చేసింది. ఇక్కడ కూడా ఇదే తంతు కొనసాగుతుందని గుర్తించారు. నిషేధించిన సింథటిక్ ఫుడ్ కలర్ టార్టాజైన్, సన్ సెట్ పసుపులను టీ పొడిలో కలుపుతున్నట్టు గుర్తించారు. టీ పౌడర్ ప్యాకెట్లలో నమూనాలను విశ్లేషణకై సేకరించారు. ఎలాంటి లైసెన్సులు లేకుండా వ్యాపారం నిబంధనలకు విరుద్దంగా , కల్తీలతో టీపౌడర్ తయారు చేయడంపై వీరిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫారసు చేశారు. మరో అస్సాం టీ కంపెనీను తనిఖీకీలలో కూడా ఇవే విధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘన, టీపౌడర్ లో నిషేధిత పదార్ధాలు కలపడం వంటి పనులు చేస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ అస్సాం టీ కంపెనీపై కూడా కేసులు నమోదు చేశారు. రాజమండ్రి రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో కల్తీ ఆహార పదార్ధములు తయారు చేయుట, అమ్మడం చేస్తే సదరు వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!