Bengaluru: కాంగ్రెస్ నేతను కొట్టిన డీకే.శివకుమార్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే..
కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 26న 14 స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హావేరీకి చేరుకున్నారు. పార్టీ అభ్యర్థి వినోదా అసూటి తరపున ప్రచారానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి.. నినాదాలు చేస్తున్నారు. ఆయన కారు దిగి నడుస్తుండగా కాంగ్రెస్ నేత, మునిసిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్.. ఏకంగా డీకే.శివకుమార్ భుజంపై చెయ్యి వేశాడు. దీంతో అసహనానికి గురైన డిప్యూటీ సీఎం.. చెంపచెళ్లుమనిపించారు. అంతేకాకుండా పక్కకు నెట్టేశారు. ఇక సెక్యూరిటీ సిబ్బంది అయితే వెనక్కి నెట్టేశారు. ఈ పరిణామంతో ఆ నాయకుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
ఇది కూడా చదవండి: Congress: “అయోధ్య శ్రీరాముడికి మద్దతు ఇచ్చినందుకు వేధింపులు”.. కాంగ్రెస్కి రాధికా ఖేరా గుడ్ బై..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 26న 14 స్థానాలకు ఓటింగ్ ముగియగా.. మిగిలిన 14 స్థానాలకు మే 7న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం యావత్తు దేశాన్ని కుదిపేస్తోంది. విదేశాల్లో ఉన్న ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. డీకే.శివకుమార్ కుట్ర చేసి ఇరికించారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: CSK vs PBKS: రాణించిన జడేజా.. సీఎస్కే ఎంత స్కోరు చేసిందంటే..?
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!