ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఓ మోస్తరు స్కోరు చేసింది. పంజాబ్ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచింది. చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సిక్సర్ల దూబె మళ్లీ విఫలమయ్యాడు. ఏమీ పరుగులు చేయకుండా డకౌట్ అయ్యాడు. ధోనీ కూడా ఒక్క రన్ చేయకుండానే ఔటయ్యాడు.
Lok Sabha Polls 2024: ఎన్నికల ముందు కాంగ్రెస్కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 200 మంది..
సీఎస్కే బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన అజింక్యా రహానే (9), రుతురాజ్ గైక్వాడ్ (32) పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత డారిల్ మిచెల్ (30) రన్స్ చేశాడు. మొయిన్ అలీ (17), అత్యధికంగా రవీంద్ర జడేజా (43) పరుగులు చేశాడు. ఆ తర్వాత మిచెల్ సాంథ్నర్ (11), శార్దూల్ ఠాకూర్ (17), ధోనీ గోల్డెన్ డకౌటయ్యాడు. పంజాబ్ బౌలింగ్ లో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత అర్ష్ దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా, సామ్ కరన్ ఒక వికెట్ తీశాడు.
Getup Srinu: ఆ విషయంలో యాంకర్ శ్యామల సమాధానమే నా సమాధానం