Bengaluru: కాంగ్రెస్ నేతను కొట్టిన డీకే.శివకుమార్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల ప్రచారంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది.
అసలేం జరిగిందంటే..
కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 26న 14 స్థానాలకు పోలింగ్ ముగిసింది. మిగిలిన 14 స్థానాలకు మే 7న పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హావేరీకి చేరుకున్నారు. పార్టీ అభ్యర్థి వినోదా అసూటి తరపున ప్రచారానికి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి.. నినాదాలు చేస్తున్నారు. ఆయన కారు దిగి నడుస్తుండగా కాంగ్రెస్ నేత, మునిసిపల్ సభ్యుడు అల్లావుద్దీన్ మనియార్.. ఏకంగా డీకే.శివకుమార్ భుజంపై చెయ్యి వేశాడు. దీంతో అసహనానికి గురైన డిప్యూటీ సీఎం.. చెంపచెళ్లుమనిపించారు. అంతేకాకుండా పక్కకు నెట్టేశారు. ఇక సెక్యూరిటీ సిబ్బంది అయితే వెనక్కి నెట్టేశారు. ఈ పరిణామంతో ఆ నాయకుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఇది కూడా చదవండి: Congress: “అయోధ్య శ్రీరాముడికి మద్దతు ఇచ్చినందుకు వేధింపులు”.. కాంగ్రెస్కి రాధికా ఖేరా గుడ్ బై..
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. అనంతరం మే 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.
కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉండగా రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 26న 14 స్థానాలకు ఓటింగ్ ముగియగా.. మిగిలిన 14 స్థానాలకు మే 7న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం యావత్తు దేశాన్ని కుదిపేస్తోంది. విదేశాల్లో ఉన్న ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. డీకే.శివకుమార్ కుట్ర చేసి ఇరికించారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.
ఇది కూడా చదవండి: CSK vs PBKS: రాణించిన జడేజా.. సీఎస్కే ఎంత స్కోరు చేసిందంటే..?
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!