Milind Parande: ఉదయనిధి స్టాలిన్ను వెంటనే అరెస్ట్ చేయాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Milind Parande: సనాతన ధర్మంపై కామెంట్లు చేసి ఒక్కసారి హిందూ సంఘాలు, వీహెచ్పీ నేతలు, బీజేపీకి టార్గెట్ అయిపోయారు తమిళనాడు సీఎం కుమారుడు, మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్.. ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు వీహెచ్పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే.. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మంపై భయానక వ్యాఖ్యలు చేసిన సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉదయనిధి స్టాలిన్ను పదవి నుంచి తొలగించాలన్న ఆయన.. తమిళనాడు ప్రభుత్వం విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అన్నారు.
Read Also: Asia Cup 2023: కోహ్లీ అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించిన బీజేపీ ఎంపీ.. అది తట్టుకోలేకపోయానంటూ..!
Also Read
- YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
- Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
- Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
ఇక, ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసును తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు మలింద్ పరాండే.. మరోవైపు.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుల నియామకంపై స్పందిస్తూ.. టీటీడీ బోర్డులోకి అన్యులను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్నారు. తిరుమల దర్శనం అందరికీ అందేలా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ భక్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలి.. స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయాల నిర్వహణ హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవ మిషనరీలు, ముస్లింలు మత మార్పిడులు చేయడాన్ని మేం ఆపుతామని ప్రకటించారు. ప్రభుత్వాలు.. దేవాలయాలను కంట్రోల్ చేయడం సరైనది కాదని వార్నింగ్ ఇచ్చారు. భజరంగ్ దళ్ శౌర్య యాత్ర చేయబోతున్నాం.. ఏపీలో మతమార్పిడులు ఎక్కువగా జరగడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. విశ్వహిందూ పరిషత్ కు ఇది 60వ సంవత్సరం.. వీహెచ్పీని ఈ సంవత్సరం లక్ష స్ధానాలకు వ్యాపింపచేయడం మా ఉద్దేశం అని.. కోటి మందిని వీహెచ్పీలోకి తీసుకొస్తాం.. 1058 వ్యవస్ధాపక జిల్లాలుగా భారతదేశాన్ని విభజించామని తెలిపారు వీహెచ్పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ బాధితులకు జగన్ భరోసా.. అండగా ఉంటాం.. న్యాయపోరాట ఖర్చులన్నీ భరిస్తాం..
-
Karnataka: కర్ణాటక సీఎంగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం
-
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Central Cabinet: భారీ శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్.. తెలంగాణలో ఆ రహదారులు ఇక 4 లైన్లుగా..
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!