Vemula Prashanth Reddy : బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ వైఖరి వల్ల దేశ సమగ్రతకే పెనుముప్పు అని ఆరోపించారు తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నిస్తున్న వారి మీద అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. ఈడి కేసులు అంటేనే.. నేడు ఓ జోక్ అయిపోయిందని ఆయన విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలను తమ స్వార్థానికి బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులను పని చేసుకోనివ్వకుండా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశం మొత్తాన్ని దోచుకుంటున్నది బీజేపీ.. అసలు ఈడీ కేసులు పెట్టాల్సింది బీజేపీ మీదనే అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు తనను తిడితే పెద్దవాళ్లమై పోతామని భ్రమపడుతున్నారని అన్నారు.
Also Read : Black Heads: ముఖంపై నల్లటి మచ్చలున్నాయా.. ఈ వంటింటి చిట్కాలు మీ కోసమే!
Also Read
ప్రతిపక్షాలు ఎంత తిడితే ప్రజల్లో మాకు అంత పాజిటివ్ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. ప్రజలు ఇలాంటి విషయాలన్నింటినీ గమనిస్తున్నారని.. అంతిమంగా ఎవరు కావాలో నిర్ణయించేది వారేనని అన్నారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి గడిచిన ఎనిమిదేండ్లలోనే జరిగిందని..అప్పటి కన్నా ఒక రూపాయి ఎక్కువే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతవరకు ఇక్కడ ఎవరికీ చోటులేదని, ఈ ప్రాంత తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ,బీజేపీని తిరస్కరించారని అన్నారు. దమ్ముంటే తెలంగాణ పథకాలను మొదలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసి చూపాలని మంత్రి వేముల వ్యాఖ్యానించారు.
Also Read : Avinash Reddy : అవినాష్ రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే..!
తాజావార్తలు
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!