YSRCP: పాదయాత్రే కాదు.. పాకుడు యాత్ర చేసినా.. పొర్లు దండాలు పెట్టినా ఎమ్మెల్యేగా గెలవడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవాడలోకి ప్రవేశించనుంది.. అయితే, లోకేష్పై మాటల యుద్ధానికి దిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. లోకేష్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. పాదయాత్ర చేసినా, పాకుడు యాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా.. లోకేష్ మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేడు అంటూ జోస్యం చెప్పారు.. దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాలని సవాల్ చేసిన ఆయన.. లోకేష్ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ప్రకటించారు.. ఇక, లోకేష్ ను మేం అడ్డుకుంటే ఇన్ని రోజులు పాదయాత్ర చేసి ఉండేవాడా? అని ప్రశ్నించారు.. పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో లోకేష్ చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. విజయవాడ నగరానికి చంద్రబాబు, లోకేష్ ఏం చేశారో చెప్పగలరా? అని నిలదీశారు.
కృష్ణ వరద ముంపుకు గురయ్యే ప్రాంతాల కోసం చంద్రబాబు రిటైనింగ్ వాళ్లు ఎందుకు కట్టలేకపోయాడు? అని ప్రశ్నించారు వెల్లంపల్లి.. 500 కోట్ల రూపాయలు పెట్టి సీఎం వైఎస్ జగన్ రిటైనింగ్ నిర్మించి చుక్క నీరు ఇళ్లల్లోకి వెళ్లకుండా చేశారని తెలిపారు. కనకదుర్గ ఫ్లైఓవర్ ను పూర్తి చేసింది ఎవరు? విజయవాడ ఫ్లై ఓవర్ ను ప్రారంభించి పూర్తి చేసిన ఘనత సీఎం జగన్దే అన్నారు. ఇక్కడ అడుగు పెట్టే ముందు మా హయాంలో విజయవాడ నగరాన్ని నిర్లక్ష్యం చేశాం.. తప్పు అయిపోయిందని చెప్పి రావాలి అంటూ లోకేష్కి సూచించారు. మరోవైపు.. లోకేష్ ను అడ్డు కోవాల్సిన అవసరం మాకు లేదని.. మేం టైం వేసుకుంటామా? అని ఎదురు ప్రశ్నించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.
Also Read
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
ఇక, లోకేష్ ఈవినింగ్ వాక్ చేస్తున్నాడు అంటూ సెటైర్లు వేశారు విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్.. ఎందుకూ పనికి రాని బఫూన్ నాయకులు జగన్ గురించి మాట్లాడుతున్నారు.. జగన్ చేసిన అభివృద్ధిని లోకేష్ తిరిగి తెలుసుకోవాలని సూచించారు. ఒక సామాన్య కార్యకర్త అయిన మా ఇంటికి సీఎం వచ్చినా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు.. విజయవాడలో అడుగు పెట్టే ముందు లోకేష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. మా హయాంలో ఏమీ చేయలేక పోయాం అని లెంపలేసుకోవాలన్న ఆయన.. ప్రకాశం బ్యారేజి దగ్గరకు రాగానే క్షుద్ర పూజలు చేసినందుకు అమ్మవారికి క్షమాపణలు చెప్పాలన్నారు. తమ హయాంలో విజయవాడ నగరానికి ఏమీ చేయనందుకు గుంజీలు తీయాలి.. విజయవాడ పేరు కూడా లేకుండా చేయాలని చూశారంటూ మండిపడ్డారు. చంద్రబాబు మూడేళ్ల పాలనలో విజయవాడ నగరంలో లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర ఉందా? ఈ నాలుగేళ్లలో విజయవాడ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. జాకీలు పెట్టి లేపితే కాని యువగళం రోడ్డు మీదకు రాదంటూ ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!