TG Crop Loan: పంట రుణాల పరిమితి ఖరారు.. ఒక్క ఎకరాకు ఎంత రుణం ఇస్తారంటే..
- పంట రుణాల పరిమితి ఖారారు..
- సాగు పంటను బట్టి లోన్స్ మంజూరు..
- అత్యధికంగా రూ.1.50 లక్షల వరకు రుణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని రైతులకు వచ్చే సాగు సీజన్ (2026-27 ఆర్థిక సంవత్సరం) కోసం పంట రుణాల పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (TSCAB) అధికారికంగా ఖరారు చేసింది. సాగు ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఈ రుణ పరిమితులను నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలోని రైతులు సాగు చేసే ప్రధాన పంటలకు సంబంధించి ఎకరాకు ఇచ్చే రుణ మొత్తాన్ని బ్యాంకులు ఖరారు చేశాయి. దీనివల్ల రైతులకు పెట్టుబడి సాయం సకాలంలో అందడమే కాకుండా, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసే అవసరం తగ్గుతుంది.
Also Read
Also Read:Tax on Mobile Data : మొబైల్ డేటాపై కొత్త పన్ను..! ఒక్క జీబీ డేటాపై ఎంత చెల్లించాలంటే..?
ప్రధాన పంటలు – రుణ వివరాలు (ఎకరాకు)..
1. వరి సాగు..
వరి పంట సాగు చేసే విధానాన్ని బట్టి రుణ పరిమితి మారుతుంది. సాధారణ వరి సాగుకు.. ఎకరాకు రూ.48,000 వరకు రుణం లభిస్తుంది. SRI (శ్రీ) వరి సాగుకు.. రూ.38,000గా నిర్ణయించారు. వరి విత్తనోత్పత్తి.. విత్తనాల తయారీ కోసం సాగు చేసే రైతులకు రూ.51,000 అందజేస్తారు.
2. పత్తి సాగు..
రాష్ట్రంలో అత్యధికంగా సాగయ్యే పత్తి పంటకు గణనీయమైన రుణ సాయం అందుతోంది. నీటి వసతి ఉన్న భూములకు ఎకరాకు రూ.52,000, వర్షాధార భూములకు ఎకరాకు రూ.50,000. పత్తి విత్తనోత్పత్తికి.. అత్యధికంగా రూ.1,50,000 వరకు రుణ పరిమితిని నిర్ణయించారు.
3. వాణిజ్య, ఇతర పంటలు..
మిరప సాధారణ సాగుకు రూ.90,000, మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తే రూ.1,00,000 వరకు రుణం పొందవచ్చు. పసుపు సాగుకు ఎకరాకు రూ.92,000 రుణంగా ఇస్తారు. మొక్కజొన్న సాగు విధానాన్ని బట్టి రూ.32,000 నుండి రూ.38,000 వరకు, స్వీట్కార్న్ కు రూ.43,000 వరకు పరిమితి ఉంది. కంది పంట సాగు ప్రాంతాన్ని బట్టి రూ.23,000 నుంచి రూ.27,000 వరకు లభిస్తుంది. ఉద్యానవన పంటల సాగులో ముఖ్యంగా టమాటాకు రూ.58,000, ఉల్లి సాగుకు రూ.49,000 గా ఖరారు చేశారు. పప్పు ధాన్యాల సాగులో ముఖ్యంగా పెసలు వంటి పంటలకు రూ.20,000 నుంచి రూ.22 వేల వరకు రుణం అందుతుంది.
Also Read:Stock Market: మార్కెట్ అల్లకల్లోలం.. లక్షల కోట్ల సంపద ఆవిరి
రుణం ఎలా పొందాలి..?
రైతులు తమ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) లేదా వాణిజ్య బ్యాంకుల ద్వారా ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డు , సాగు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రుణాన్ని తిరిగి చెల్లించే రైతులకు వడ్డీ రాయితీ వర్తిస్తుంది.
ఈ రుణ పరిమితులు జిల్లా స్థాయి సాంకేతిక కమిటీల (DLTC) సిఫార్సుల మేరకు అపెక్స్ బ్యాంక్ ఖరారు చేస్తుంది. దీనివల్ల రైతులకు ఎరువులు, కూలీల ఖర్చులు, విత్తనాల కొనుగోలుకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. రైతులు ఈ రుణ సదుపాయాన్ని వినియోగించుకుని ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టి లాభాలు గడించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: పుత్తడి అమ్మకాలు ఎందుకు తగ్గాయి..? ఆర్థిక పరిస్థితులే కారణమా..?
-
Neetu Bhai : కిరాణా షాపులో గంజాయి దందా.. లేడీ డ్రగ్ డాన్ అడ్డా నేలమట్టం.!
-
Off The Record: శృంగవరపు కోట TDPలో గ్రూప్ వార్!
-
UP: అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!.. అఖిలేష్ యాదవ్కు భారీ ఝలక్ తప్పదా?
-
kitchen tips: చపాతీ కర్రకు బూజు పడుతోందా? ఈ చిన్న ట్రిక్తో ఫంగస్కు చెక్ పెట్టండి!
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!