Vande Bharat Train: త్వరలో 20 కోచ్లతో వందే భారత్ రైలు.. ఏ మార్గాల్లో నడువనుందంటే..?
- త్వరలో 20 కోచ్ల వందే భారత్ రైలు
- ఢిల్లీ నుంచి కొన్ని నిర్దిష్ట మార్గాల్లో నడువనున్నట్లు చెబుతున్న అధికారులు
- పెరుగుతున్న రద్దీ.. పండుగల దృష్ట్యా ఏర్పాట్లు
- వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారత్లో క్రేజ్ పెరుగుతుండడం గమనార్హం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వే త్వరలో 20 కోచ్ల వందే భారత్ రైలును తీసుకురానుంది. ఈ రైలు ఢిల్లీ నుంచి కొన్ని నిర్దిష్ట మార్గాల్లో నడువనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న రద్దీ, పండుగల దృష్ట్యా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారత్లో క్రేజ్ పెరుగుతుండడం గమనార్హం. మరోవైపు ఈ రైలు స్పీడ్, సౌకర్యాల కారణంగా.. ప్రజలు ఇష్టపడుతున్నారు. అయితే.. ఈ రైలులో పెరుగుతున్న డిమాండ్ కారణంగా టిక్కెట్ల కొరత ఉంది. ప్రస్తుతం వందే భారత్ రైలు 8, 16 కోచ్లతో నడుస్తోంది. ఈ క్రమంలో జనాలు ఈ రైలు టిక్కెట్లు పొందడం కష్టంగా మారుతుంది.
Vinayaka Laddu Theft: ఓర్నీ నీ దుంపతెగ.. వినాయకుడిని కూడా వదలని దొంగ!
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఉత్తర రైల్వే రూట్లలో 20 కోచ్లతో వందేభారత్ రైలు నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. న్యూఢిల్లీ-వారణాసి (రెండు రైళ్లు), న్యూ ఢిల్లీ-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా (రెండు రైళ్లు), న్యూఢిల్లీ-అంబ్ అండురా (హిమాచల్ ప్రదేశ్), హజ్రత్ నిజాముద్దీన్-రాణి కమలపతి, న్యూఢిల్లీ మార్గాల్లో ఈ రైలు నడిచే అవకాశం ఉంది. ఈ రైలు వేగం గంటకు 130 కి.మీ. 20 కోచ్లతో కూడిన వందేభారత్ రైలును ఆగస్టులో విజయవంతంగా ట్రయల్ చేశారు.
Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. కోస్తా జిల్లాల్లో అతిభారీ వర్షాలు
ప్రస్తుతం.. 16 కోచ్ల వందే భారత్లో రెండు ఎగ్జిక్యూటివ్ AC చైర్ కార్ కోచ్లు, 16 AC చైర్ కార్ కోచ్లు ఉన్నాయి. మొత్తం 1204 సీట్లు ఉన్నాయి. 20 కోచ్లతో కూడిన వందే భారత్లో ప్రయాణికులకు ఎక్కువ స్థలం ఉంటుంది. సీటింగ్ కెపాసిటీని 25 శాతం పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ నుంచి వివిధ మార్గాల్లో 11 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
- Tags
- 20 coaches
- routes
- Run
- soon
- telugu news
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!