Vande Bharat Fares: తగ్గుతున్న వందే భారత్ ఛార్జీలు.. కారణమేంటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ ఎక్స్ప్రెస్లో కొన్ని రైళ్ల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని రైల్వే భావిస్తుంది. అయితే ఛార్జీలు తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ వందేభారత్ లో ప్రయాణించవచ్చని తెలుపుతుంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో వందేభారత్ రైలును నడపడం వల్ల రైల్వేకు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం వందేభారత్ ఛార్జీలను తగ్గిస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు నడిచే వందే భారత్ రైళ్లలో ఛార్జీలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా లేవు. దీంతో అందరికి అందుబాటులో ఉండేవిధంగా ఛార్జీలను తగ్గించాలని రైల్వే ఆలోచిస్తోంది. అయితే ఛార్జీలు తగ్గించే దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం..
Preview vs Prevue: జవాన్ ప్రెవ్యూ రిలీజ్.. ఇంతకీ ప్రెవ్యూ అంటే ఏంటో తెలుసా?
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
రైల్వే శాఖ ప్రకారం.. ప్రస్తుతం షార్ట్ రూట్ రైళ్లు మినహా మిగిలిన రైళ్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. అయితే చిన్న రూట్ రైళ్లలో తక్కువ మంది ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిల్లో.. ఈ మార్గాల రైళ్ల ఛార్జీలను పరిగణనలోకి తీసుకుని, మార్పులు చేయవచ్చు. వందే భారత్లో అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు 3 గంటలు. ఎక్కువ దూరం ప్రయాణించే రైలు 10 గంటలు. అయితే 3 గంటల సమయం పట్టే రైళ్లలో ప్రయాణించేందుకు జనం మొగ్గు చూపడం లేదు.
Pushpa 2 : పుష్ప 2 లో నటించబోతున్న ఆ బాలీవుడ్ హీరో..?
వందే భారత్ రైలు ప్రారంభించినప్పటి నుండి కొన్ని రూట్లలో దాని చాలా కోచ్లు ఖాళీగా ఉండటాన్ని రైల్వేశాఖ గుర్తించింది. తక్కువ దూర మార్గాల్లోని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రైళ్లలో సీట్లు పూర్తిగా నిండకపోవడంతో రైల్వేశాఖ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రైళ్ల ఛార్జీలను తగ్గించే ఆలోచనలో రైల్వేశాఖ ఉంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండి ప్రయాణికులు వెళ్లని రైళ్లను అద్దెకు తీసుకోవచ్చు. ఈ జాబితాలో ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్పూర్ మరియు నాగ్పూర్-బిలాస్పూర్ రూట్ రైళ్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
-
IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
-
Aashram Season 4: 3 సీజన్లు, 33 ఎపిసోడ్లతో 6 ఏళ్లుగా ఓటీటీని ఏలిన సిరీస్.. నాలుగో సీజన్లో బాబా నిరాలా రిటర్న్!
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!