France: ఫ్రాన్స్ ఒలింపిక్స్ క్రీడల సమయంలో కొనసాగుతున్న విధ్వంసకాండ..
- ఫ్రాన్స్లో కొనసాగుతున్న విధ్వంసకాండ..
- ఒలింపిక్స్ క్రీడల సమయంలో విద్రోహ శక్తుల దాడులు..
- హైస్పీడ్ రైల్స్.. కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
France: అల్లరిమూకలు ఫ్రాన్స్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా పారిస్లో ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వానికి విద్రోహులు సవాల్ విసురుతున్నారు. తాజాగా ఈ హింస ఫైబర్, మొబైల్ నెట్వర్క్, ల్యాండ్లైన్ సర్వీసుల్ని తాకింది. ఫ్రాన్స్ చుట్టూ ఉన్న నగరాలు పారిస్ ఒలింపిక్స్ 2024 నిర్వహిస్తున్న తరుణంలో విధ్వంసకారులు మల్టీ టెలికమ్యూనికేషన్ లైన్లకు అంతరాయం కలిగించారు. ఫైబర్ లైన్లు, మొబైల్ సేవలపై ప్రభావం పడినట్లు ఫ్రెంచ్ ప్రభుత్వం సోమవారం వెల్లడించింది.
అంతకుముందు, పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఫ్రాన్స్ చుట్టూ ఉన్న రైలు నెట్వర్క్పై విద్రోహ శక్తులు దాడి చేశాయి. పలు స్టేషన్లలో వ్యవస్థలను కాల్చి బుగ్గి చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం కమ్యూనికేషన్ నెట్వర్క్ని ధ్వంసం చేశారు. అయితే, దీని ప్రభావం ఒలింపిక్పై పడిందా లేదా..? అనేది అస్పష్టంగా ఉంది. డిజిటల్ వ్యవహారాల ఇన్ఛార్జ్ స్టేట్ సెక్రటరీ మెరీనా ఫెరారీ, ఆదివారం నుండి సోమవారం వరకు రాత్రిపూట అనేక ప్రాంతాలలో టెలికమ్యూనికేషన్స్ మౌలిక సదుపాయాలకు నష్టం జరిగిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ పిరికిపంద, బాధ్యతారాహిత్యమైన చర్యల్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఒలంపిక్ సాకర్ మరియు సెయిలింగ్ పోటీలను నిర్వహిస్తున్న మార్సెయిల్ చుట్టూ ఉన్న ప్రాంతంతో సహా కనీసం ఆరు అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు ప్రభావితమయ్యాయని ఫ్రెంచ్ పోలీసు వెల్లడించారు. దక్షిణ ఫ్రాన్స్లోని పలు ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా విద్యుత్ క్యాబినెట్లలోని వైర్లను కత్తిరించారని, లక్సెంబర్గ్ సమీపంలోని మీస్ ప్రాంతంలో మరియు పారిస్ సమీపంలోని ఓయిస్ ప్రాంతంలోని ఇన్స్టాలేషన్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి దిగారని అక్కడి అధికారులు తెలిపారు.
ఈ దాడుల తర్వాత ఒక వామపక్ష తీవ్రవాదిని ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విధ్వంసకారులు ఫ్రాన్స్ హై-స్పీడ్ రైలు నెట్వర్క్పై సిగ్నల్ సబ్స్టేషన్లు , కేబుల్లను లక్ష్యంగా చేసుకుని సమన్వయంతో దాడులు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు కొన్ని గంటల ముందు తెల్లవారుజామున జరిగిన దాడి కారణంగా ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం సాధారణ రైలు రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి, అయితే సుమారు 8,00,000 మంది ప్రజలు గణనీయమైన అంతరాయాలను ఎదుర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!