Vallabhaneni Pankaja Sri: వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు.. మేం చూసుకుంటాం అని జగన్ భరోసా ఇచ్చారు!
- ములాఖత్లో వల్లభనేని వంశీని కలిసిన పంకజశ్రీ
- జైలులో వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు
- మేం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీ చాలా ధైర్యంగా ఉన్నారని ఆయన సతీమణి పంకజశ్రీ తెలిపారు. లీగల్గా తాము చూసుకుంటాం అని, భయపడవద్దు అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దైర్యం చెప్పారన్నారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నామని, చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నామని చెప్పారు. దయచేసి మహిళల మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టవద్దని పంకజశ్రీ కోరారు. విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైలులో భర్త వంశీని ములాఖత్లో పంకజశ్రీ కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వంశీతో వైఎస్ జగన్, పంకజశ్రీ, సింహాద్రి రమేష్ మాట్లాడారు.
వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం పంకజశ్రీ మీడియాతో మాట్లాడారు. ‘వంశీ చాలా ధైర్యంగా ఉన్నారు. వైఎస్ జగన్ లీగల్గా మేం చూసుకుంటాం అని భరోసా ఇచ్చారు, భయపడవద్దు అని దైర్యం చెప్పారు. సత్యవర్ధన్ కేసులో 20 వేల కోసం కిడ్నాప్ చేశారని చెప్పారు. వంశీ దగ్గర ఆ 20 వేల రికవరీ కోసం పోలీసులు 10 రోజులు కస్టడీ అడుగుతున్నారు. మేం బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం, చట్ట ప్రకారం ముందుకు వెళ్తున్నాం. సోషల్ మీడియాలో మహిళలపై పోస్టులు పెట్టకూడదు అంటున్నారు.. మా మీద అభ్యంతరకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక పార్టీకి సంబంధించిన వారే మహిళలా?.. మిగతా వారు మహిళలు కాదా?. దయచేసి మహిళల మీద సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టవద్దు’ అని పంకజశ్రీ కోరారు.
Also Read
- CJP Protest: నేడు హైదరాబాద్లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ధర్నా.. సోనమ్ వాంగ్చుక్ హాజరు!
- Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
- IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
- Rohit Sharma Run Out: రోహిత్ శర్మ ఆశలపై నీళ్లు చల్లిన గిల్.. కెప్టెన్పై హిట్మ్యాన్ ఫైర్!
వల్లభనేని వంశీ న్యాయవాది చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ‘ఇవాళ ఎమినిటీస్ కోసం బెయిల్ పిటిషన్ వేశాం. కోర్టులో కొన్ని పిటిషన్లు నడుస్తున్నాయి. కొంత సమయం పట్టొచ్చు’ అని చిరంజీవి చెప్పారు. విజయవాడ జైల్లో కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ములాఖత్లో వంశీని పరామర్శించడానికి కొడాలి నాని,పేర్ని నాని పేర్లు కూడా వైసీపీ నేతలు ఇచ్చారు. సెక్యూరిటీ రీజన్స్ కారణంగా ఈ ఇద్దరికీ అనుమతి ఇవ్వలేమని జైలు అధికారులు చెప్పారు.
తాజావార్తలు
-
CJP Protest: నేడు హైదరాబాద్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా.. సోనమ్ వాంగ్చుక్ హాజరు!
-
Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!
-
SURIYA : సూర్య 50.. కథ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్?
-
IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
-
Senior Citizen Savings Scheme : సీనియర్ సిటిజన్లకు ప్రతి నెలా రూ. 20,000 వడ్డీ… ఏ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టాలంటే ?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!