Vaddiraju Ravichandra : వరంగల్ లో జరగనున్న బీఆర్ఎస్ సభకి వెళ్ళ నీయకుండా వాహనాలను నిలిపి వేయడం చట్ట విరుద్ధమని ఇది పద్ధతి కాదని బీఆర్ఎస్ నేతలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, జిల్లా ఆధ్యక్షుడు తాత మధు అంటున్నారు. ప్రైవేటు స్కూల్ బస్సులను అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యం లో నడుస్తున్న వాహనాలను బి ఆర్ఎస్ సభ కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవటం సరి కాదని అన్నారు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ సభను అడ్డు కున్నది తాము మాత్రం కాదని ఆనాడు.. బిఆర్ఎస్ పార్టీలో ఉండి నేడు మంత్రులుగా ఎం ఎల్ ఏ గా ఉన్నవారు మాత్రమేనని వారు అంటున్నారు. మేము ఎప్పుడూ ప్రజాస్వామిక పరంగా ఉన్నామని అన్నారు. ఈ పద్ధతులు అనుసరిస్తే అధికార పార్టీకి మంచి పద్ధతి కాదని అంటున్నారు.