V.Hanumantha Rao :బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజీవ్ గాంధీ పేరుతో 15 ఏళ్ల నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ సారి భారత్ జోడో ఆల్ ఇండియా అండర్ 19 టీ 20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు వెల్లడించారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 17 టీమ్స్ పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీకి మద్దతుగా భారత్ జోడో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Also Read : SBI Alert: పాన్ నంబర్ లింక్ చేయకపోతే అకౌంట్ బ్లాక్..! క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ
Also Read
- Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
- Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే 'క్షమాపణ'.. గేటు దాటకపోతే 'బలిపశువా'..?
- T20 World Cup: 18 ఏళ్ల కల ముక్కలైంది.. దేశానికి కప్పు అందించలేకపోయానంటూ ఏడ్చేసిన కెప్టెన్..
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
మార్చి 22 నుండి 25 వరకు మొత్తం మూడు క్రీడా మైదానంలో క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయన్నారు. అయితే.. హైదరాబాద్ లో కుక్కల వలన చాలా మంది పిల్లలు చనిపోయారని, ఇంతకుముందు కుక్కలను నియంత్రణ చేసేవారు కానీ ఇప్పుడు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కుక్కలు పట్టుకోవడానికి టీమ్ ను ఏర్పాటు చేసి నియంత్రణ చేయాలన్నారు. వీధి కుక్కలను నియంత్రణ చేయకపోతే చిన్న పిల్లలపై దాడులు పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : NIA Raids: గ్యాంగ్స్టర్లను వెంటాడుతున్న ఎన్ఐఏ.. కీలక సమాచారంతో 8 రాష్ట్రాల్లో దాడులు
జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలన్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఏఐసీసీ ప్లీనరి సమావేశాల సందర్భంగా అక్కడి సీఎం భూపేష్ బాగేల్ సోదరుడికి ఈడీ నోటీసులు ఇచ్చారని, కాంగ్రెస్ సభలు పెట్టుకుంటే బీజేపీకి ఎందుకు భయం ఆయన అన్నారు. ప్రతిపక్షాలు వుండవద్దనే ఉద్దేశ్యంతో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు వీహెచ్. కావాలనే కాంగ్రెస్ నేతలను కేసులతో వేధిస్తున్నారని, బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసుల వెనుక అమిత్ షా వున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నీ బీజేపీ గుప్పిట్లో ఉన్నాయని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
Balakrishna :”ఆనాడు అమ్మ అడిగిన ప్రశ్న వల్లే ఇది సాధ్యమైంది..”\
-
Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
-
Neet Re Exam: పేపర్ లీక్ చేస్తే ‘క్షమాపణ’.. గేటు దాటకపోతే ‘బలిపశువా’..?
-
T20 World Cup: 18 ఏళ్ల కల ముక్కలైంది.. దేశానికి కప్పు అందించలేకపోయానంటూ ఏడ్చేసిన కెప్టెన్..
-
Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!