Cyber Crime: మాఫియా డాన్ కుమారుడికే టోకరా.. సైబర్ కేటుగాళ్ల ఘరానా మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: రోజురోజుకు ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్కేర్ లేదా టెలికాం ఉద్యోగులు ప్రభుత్వ అధికారులుగా బ్యాంకు వినియోగదారులకు ఫోన్లు చేస్తున్నారు. తాజాగా యూపీలో మాఫియా డాన్ కుమారుడినే మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు. మాఫియా డాన్ బ్రిజేష్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ సింగ్కు బ్రాండ్ పెయింట్ కంపెనీ డీలర్షిప్ ఇప్పిస్తానని సైబర్ దుండగులు రూ. 11 లక్షలు మోసం చేశారని పోలీసులు తెలిపారు.
Read Also: Rahul Gandhi: రాహుల్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
సిద్ధార్థ్ సింగ్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విజయ్ నారాయణ్ మిశ్రా తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 417 (చీటింగ్), 420, 465 (ఫోర్జరీ), 468, 471 (ఫోర్జరీ), ఐటీ చట్టంలోని 66డీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఈ కేసుపై సైబర్ క్రైమ్ సెల్ దర్యాప్తు ప్రారంభించిందని ఆయన తెలిపారు. ప్రముఖ పెయింట్ కంపెనీ డీలర్షిప్ కేటాయింపు కోసం ఆన్లైన్ ప్రకటనను చూసిన తర్వాత, ఫిబ్రవరిలో ప్రకటనలో అందించిన మొబైల్ నంబర్ను ఉపయోగించి కంపెనీ డైరెక్టర్గా చెప్పుకునే అమిత్ సింగ్లీని సంప్రదించినట్లు సిద్ధార్థ్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Read Also: BJP: ఈశ్వరప్పపై బీజేపీ కొరడా.. ఆరేళ్లు బహిష్కరణ
డీలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ఆయన కలినా (ముంబై) బ్యాంక్ ఖాతాలో ₹ 11,14,539 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని అమిత్ సింగ్లీ సిద్ధార్థ సింగ్కి తెలియజేశాడు. సింగ్లీ ఖాతా నంబర్, డబ్బును బదిలీ చేయడానికి అవసరమైన కోడ్లను కూడా అందించాడు. మార్చి 9న, అతను తన బ్యాంక్ ఖాతా నుండి అదే మొత్తాన్ని సింగ్లీ అందించిన ఖాతా నంబర్కు బదిలీ చేసానని, అతను ఆ మొత్తాన్ని రసీదు చేసినట్లు ధృవీకరణ లేఖను కూడా ఇచ్చాడని సిద్ధార్థ సింగ్ చెప్పాడు. దీని తరువాత, సింగ్లీ అతనితో కొన్ని సందర్భాలలో కమ్యూనికేట్ చేసాడు, కానీ తరువాత, అతని మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ అయింది. అనంతరం అమిత్ సింగ్లీ జాడ లేకుండాపోయింది. సిద్ధార్థ సింగ్ కంపెనీ ముంబై కార్యాలయాన్ని సందర్శించాడు. అక్కడ అమిత్ సింగ్లే కంపెనీకి డైరెక్టర్ లేదా ఉద్యోగి కాదని, డీలర్షిప్ కోసం కంపెనీ ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదని ఆయనకు సమాచారం అందింది. ఈ పరిణామాల తర్వాత, తనకు రూ. 11 లక్షలకు పైగా మోసం చేసేందుకు నకిలీ పత్రాలను మోసగాడు అందించాడని, తాను మోసపోయానని సిద్ధార్థ సింగ్ నిర్ధారించుకున్నాడు. అనంతరం ఈ మేరకు సిద్ధార్థ సింగ్ ఫిర్యాదు చేశాడు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?