Cyber Crime: మాఫియా డాన్ కుమారుడికే టోకరా.. సైబర్ కేటుగాళ్ల ఘరానా మోసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Crime: రోజురోజుకు ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తున్నట్లు ఫోన్ చేయడం, ఉద్యోగం వచ్చిందంటూ ఫోన్ చేయడం, మీ ఖాతాను బ్లాక్ చేస్తానని బెదిరించడం ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, హెల్త్కేర్ లేదా టెలికాం ఉద్యోగులు ప్రభుత్వ అధికారులుగా బ్యాంకు వినియోగదారులకు ఫోన్లు చేస్తున్నారు. తాజాగా యూపీలో మాఫియా డాన్ కుమారుడినే మోసం చేశారు సైబర్ కేటుగాళ్లు. మాఫియా డాన్ బ్రిజేష్ సింగ్ కుమారుడు సిద్ధార్థ్ సింగ్కు బ్రాండ్ పెయింట్ కంపెనీ డీలర్షిప్ ఇప్పిస్తానని సైబర్ దుండగులు రూ. 11 లక్షలు మోసం చేశారని పోలీసులు తెలిపారు.
Read Also: Rahul Gandhi: రాహుల్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
Also Read
- UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
సిద్ధార్థ్ సింగ్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ విజయ్ నారాయణ్ మిశ్రా తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 417 (చీటింగ్), 420, 465 (ఫోర్జరీ), 468, 471 (ఫోర్జరీ), ఐటీ చట్టంలోని 66డీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. ఈ కేసుపై సైబర్ క్రైమ్ సెల్ దర్యాప్తు ప్రారంభించిందని ఆయన తెలిపారు. ప్రముఖ పెయింట్ కంపెనీ డీలర్షిప్ కేటాయింపు కోసం ఆన్లైన్ ప్రకటనను చూసిన తర్వాత, ఫిబ్రవరిలో ప్రకటనలో అందించిన మొబైల్ నంబర్ను ఉపయోగించి కంపెనీ డైరెక్టర్గా చెప్పుకునే అమిత్ సింగ్లీని సంప్రదించినట్లు సిద్ధార్థ్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Read Also: BJP: ఈశ్వరప్పపై బీజేపీ కొరడా.. ఆరేళ్లు బహిష్కరణ
డీలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ఆయన కలినా (ముంబై) బ్యాంక్ ఖాతాలో ₹ 11,14,539 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని అమిత్ సింగ్లీ సిద్ధార్థ సింగ్కి తెలియజేశాడు. సింగ్లీ ఖాతా నంబర్, డబ్బును బదిలీ చేయడానికి అవసరమైన కోడ్లను కూడా అందించాడు. మార్చి 9న, అతను తన బ్యాంక్ ఖాతా నుండి అదే మొత్తాన్ని సింగ్లీ అందించిన ఖాతా నంబర్కు బదిలీ చేసానని, అతను ఆ మొత్తాన్ని రసీదు చేసినట్లు ధృవీకరణ లేఖను కూడా ఇచ్చాడని సిద్ధార్థ సింగ్ చెప్పాడు. దీని తరువాత, సింగ్లీ అతనితో కొన్ని సందర్భాలలో కమ్యూనికేట్ చేసాడు, కానీ తరువాత, అతని మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ అయింది. అనంతరం అమిత్ సింగ్లీ జాడ లేకుండాపోయింది. సిద్ధార్థ సింగ్ కంపెనీ ముంబై కార్యాలయాన్ని సందర్శించాడు. అక్కడ అమిత్ సింగ్లే కంపెనీకి డైరెక్టర్ లేదా ఉద్యోగి కాదని, డీలర్షిప్ కోసం కంపెనీ ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదని ఆయనకు సమాచారం అందింది. ఈ పరిణామాల తర్వాత, తనకు రూ. 11 లక్షలకు పైగా మోసం చేసేందుకు నకిలీ పత్రాలను మోసగాడు అందించాడని, తాను మోసపోయానని సిద్ధార్థ సింగ్ నిర్ధారించుకున్నాడు. అనంతరం ఈ మేరకు సిద్ధార్థ సింగ్ ఫిర్యాదు చేశాడు.
తాజావార్తలు
-
UPI Transactions: యూపీఐ సేవలు ఉచితం కాదు.. ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!