Uttarapradesh : అమానుషం..అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. ఇటీవల సామూహిక అత్యాచారనికి గురైన 12 ఏళ్ల మైనర్ బాలిక మృతి చెందింది.. గౌర్ ప్రాంతంలో సోమవారం బాలిక కూరగాయలు కొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మోను సాహ్ని, రాజన్ నిషాద్, కుందన్ సింగ్ అనే ముగ్గురు నిందితులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా, సింగ్ ఇంటి సమీపంలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉందని సాహ్ని వారికి సమాచారం ఇచ్చారు..
వెంటనే అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు.. సోమవారం నుంచి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది.. నిందితుడు మోను సాహ్నికి బాలికతో పరిచయం ఉందనీ, బాలికను తనతో పాటు తీసుకెళ్లింది అతనేనని, అతనితో పాటు మరో ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు.. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.. అత్యాచారం, హత్య అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను బీజేపీ సభ్యులు కాపాడుతున్నారని ఆరోపిస్తూ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.. అంతేకాదు వారిని వెంటనే ఉరితియ్యాలని పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు..
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాజకీయ ప్రతిస్పందనలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ నాయకత్వం లోని బీజేపీ సర్కారు పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు… గత నెలలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. చిన్నారులను అపహారించి అత్యాచారం చేసిన ఘటన అందరిని కదిలించి వేసింది.. యూపీలో ఇలా బాలికల పై వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు..
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..