Uttarapradesh : అమానుషం..అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో దారుణ ఘటన వెలుగు చూసింది.. ఇటీవల సామూహిక అత్యాచారనికి గురైన 12 ఏళ్ల మైనర్ బాలిక మృతి చెందింది.. గౌర్ ప్రాంతంలో సోమవారం బాలిక కూరగాయలు కొనేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. మోను సాహ్ని, రాజన్ నిషాద్, కుందన్ సింగ్ అనే ముగ్గురు నిందితులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఇంటికి తిరిగి రాకపోవడం తో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించగా, సింగ్ ఇంటి సమీపంలో ఆమె అపస్మారక స్థితిలో పడి ఉందని సాహ్ని వారికి సమాచారం ఇచ్చారు..
వెంటనే అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు.. సోమవారం నుంచి ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది.. నిందితుడు మోను సాహ్నికి బాలికతో పరిచయం ఉందనీ, బాలికను తనతో పాటు తీసుకెళ్లింది అతనేనని, అతనితో పాటు మరో ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు.. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.. అత్యాచారం, హత్య అభియోగాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను బీజేపీ సభ్యులు కాపాడుతున్నారని ఆరోపిస్తూ వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.. అంతేకాదు వారిని వెంటనే ఉరితియ్యాలని పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు..
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఉత్తరప్రదేశ్ లోని బస్తీ జిల్లాలో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాజకీయ ప్రతిస్పందనలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి యోగి అదిత్యానాథ్ నాయకత్వం లోని బీజేపీ సర్కారు పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వ శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన.. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు… గత నెలలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.. చిన్నారులను అపహారించి అత్యాచారం చేసిన ఘటన అందరిని కదిలించి వేసింది.. యూపీలో ఇలా బాలికల పై వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు..
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!