Uttam Kumar Reddy : తడిసిన ధాన్యంపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యం కూడా కొంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మద్దతు ధర ఇచ్చి కొంటామని, సీఎస్.. కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చామని, రైతులు ఆందోళన చెందోద్దని ఆయన పేర్కొన్నారు. నష్టం ప్రభుత్వం భరిస్తుందని, కొందరు మిల్లర్లు తరుగు తీస్తున్నారని, ఇది సరికాదు.. ఆపేయండని ఉత్తమ్ అన్నారు. చివరి గింజ వరకు కొంటామని, నారాయణ పూర్ డ్యామ్ నుండి నీటి విడుదలకు అంగీకారం చెప్పారని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ని నీళ్లు ఆడిగామని, 2.25 టీఎంసీ ఇవ్వడానికి అంగీకరించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాగు నీటి కోసం.. Ndsa ఇంకో వారం..పది రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ఇస్తారని, దాని ఆధారంగా పనులు చేస్తామన్నారు.
అంతేకాకుండా..’కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నష్టపోయిన రైతులను అదుకుంటాం. బీఆర్ఎస్.. బీజేపీ దోస్తీ బయట పడింది. 2018 ఎన్నికలో క్యూ లైన్ లో ఉన్న ఓటర్ల కి డబ్బులు వేశారు. కానీ ఇప్పుడు మాత్రం రైతు బంధు నిధులు ఆపేయండి అని ఈసీ చెప్పింది. మామిడి రైతుల విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్తా. మోడీ ఆధాని కి పోర్టులు ఇచ్చి ఏం వసూలు చేస్తున్నారు. అందరూ ఆయన లాగా వసూలు చేస్తున్నారు అనుకుంటున్నారు. మోడీ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. సీఎం పైనా..ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు మోడీ. రాహుల్..ఖర్గే..ప్రియాంక గాంధీ లు తెలంగాణ కి వస్తున్నారు. కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుస్తుంది. బీజేపీ కి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ప్రధాని తన హోదా ని మరిచి మాట్లాడుతున్నాడు. ఎన్నికల కమిషన్ కూడా సైలెంట్ గా ఉంది. కాంగ్రెస్ అధికారంలో కి వస్తే.. రిజెర్వేషన్ లలో 50 శాతం పరిధి ఎత్తేస్తాం. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తాం. గత ఏడాది ఇదే సమయానికి.. 13.77 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.. ఇప్పుడు 24. 85 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.. గతంలో కంటే ఈ సారి రెట్టింపు కొనుగోలు చేసాము.’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!