Uttam Kumar Reddy : తెలంగాణలో రికార్డు స్థాయిలో రబీ ధాన్యం దిగుబడి.. 70.13 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం
- రబీ సీజన్లో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
- ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 8,329 కేంద్రాల ఏర్పాట్లు
- గోదాముల్లో నిల్వలకు పూర్తి సన్నద్ధత – ప్రభుత్వం నుండి బోనస్ బహుమతులు
Uttam Kumar Reddy : తెలంగాణలో రబీ సీజన్కు సంబంధించి 57 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటల నుంచి 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాట్లు పూర్తి చేసింది.
శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో, పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.ఎస్. చౌహన్, జాయింట్ కమిషనర్ ప్రియాంకా ఏలే, డైరెక్టర్ ప్రసాద్, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ , రబీ సీజన్లను కలిపి మొత్తం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి నమోదవుతుందని తెలిపారు, ఇది దేశ స్థాయిలో అరుదైన రికార్డుగా నిలుస్తుందన్నారు.
Also Read
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- Rajnath Singh: "సుదీర్ఘ యుద్ధానికి భారత్ సిద్ధం".. ఆపరేషన్ సిందూర్పై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- Mamata Banerjee: "ఇక మనం జాగ్రత్తగా ఉండాలి".. ఎగ్జిట్ పోల్స్ అనంతరం మమతా బెనర్జీ తొలి ప్రకటన!
ప్రభుత్వం మొత్తం 8,329 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 7,337 కేంద్రాలు పని ప్రారంభించాయి. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో వరికోతల ప్రగతిని బట్టి కేంద్రాలను ప్రారంభిస్తున్నారు.
ప్రభుత్వం ఈ సీజన్లో సన్నరకాల పంటలకు ప్రత్యేకంగా రూ. 500 బోనస్ అందిస్తున్నది. దీంతో సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా అవకాశం ఉండటంతో, దాన్ని నిరోధించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 5.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కాగా, 2.74 లక్షల టన్నులు ఇంకా కేంద్రాల వద్ద ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 66.65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములు ఉన్నాయి. ఇందులో 25 లక్షల టన్నుల నిల్వల కోసం తక్షణమే ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, ప్రైవేట్ గోదాముల ద్వారా నిల్వ చేయనున్నారు. అలాగే, ధాన్యం నిల్వకు అవసరమైన గన్ని బ్యాగులు (మొత్తం 17.5 కోట్లకు అవసరం)లో 9.23 కోట్ల బ్యాగులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Minister Narayana: రేపటి నుంచి గుజరాత్లో నారాయణ బృందం పర్యటన
తాజావార్తలు
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
-
Sorakaya Paratha Recipe : మెత్తని సొరకాయ జొన్న పరాటాలు.. బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ఫాస్ట్.!
-
Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
-
Abhishek-Travis Head: అభిషేక్ ఆటతీరుపై ట్రావిస్ హెడ్ సంచలన వ్యాఖ్యలు.. ఇలా ఎప్పుడూ ఆడలేదంటూ..
-
Ntr Neel : ఎన్టీఆర్ నీల్ సినిమా రీ షూట్స్.. అసలు విషయం బయటపెట్టిన మైత్రి మూవీ మేకర్స్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!