Uttam Kumar Reddy : తెలంగాణలో రికార్డు స్థాయిలో రబీ ధాన్యం దిగుబడి.. 70.13 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యంగా ప్రభుత్వం
- రబీ సీజన్లో 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
- ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా 8,329 కేంద్రాల ఏర్పాట్లు
- గోదాముల్లో నిల్వలకు పూర్తి సన్నద్ధత – ప్రభుత్వం నుండి బోనస్ బహుమతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : తెలంగాణలో రబీ సీజన్కు సంబంధించి 57 లక్షల ఎకరాల్లో సాగు చేసిన పంటల నుంచి 127.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుని ఏర్పాట్లు పూర్తి చేసింది.
శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో, పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.ఎస్. చౌహన్, జాయింట్ కమిషనర్ ప్రియాంకా ఏలే, డైరెక్టర్ ప్రసాద్, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ , రబీ సీజన్లను కలిపి మొత్తం 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి నమోదవుతుందని తెలిపారు, ఇది దేశ స్థాయిలో అరుదైన రికార్డుగా నిలుస్తుందన్నారు.
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ప్రభుత్వం మొత్తం 8,329 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటికే 7,337 కేంద్రాలు పని ప్రారంభించాయి. నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో వరికోతల ప్రగతిని బట్టి కేంద్రాలను ప్రారంభిస్తున్నారు.
ప్రభుత్వం ఈ సీజన్లో సన్నరకాల పంటలకు ప్రత్యేకంగా రూ. 500 బోనస్ అందిస్తున్నది. దీంతో సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా అవకాశం ఉండటంతో, దాన్ని నిరోధించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 5.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కాగా, 2.74 లక్షల టన్నులు ఇంకా కేంద్రాల వద్ద ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 66.65 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాములు ఉన్నాయి. ఇందులో 25 లక్షల టన్నుల నిల్వల కోసం తక్షణమే ఏర్పాట్లు ఉన్నట్లు తెలిపారు. మిగిలిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, ప్రైవేట్ గోదాముల ద్వారా నిల్వ చేయనున్నారు. అలాగే, ధాన్యం నిల్వకు అవసరమైన గన్ని బ్యాగులు (మొత్తం 17.5 కోట్లకు అవసరం)లో 9.23 కోట్ల బ్యాగులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Minister Narayana: రేపటి నుంచి గుజరాత్లో నారాయణ బృందం పర్యటన
తాజావార్తలు
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!