IND VS AUS: తొలి రోజు ఆసీస్ దూకుడు.. సెంచరీతో చెలరేగిన ఖవాజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND VS AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను ఆసీస్ టీం ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాని నిలబెడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 251 బంతుల్లో ( 104 పరుగులు, 15 ఫోర్లు ) సెంచరీ బాధాడు. కెమరూన్ గ్రీన్ 64 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఆసీస్ జట్టు 255 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ( 38 ), ట్రావిస్ హెడ్ ( 32 ) ఫర్వలేదనిపించారు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్, జడేజాలకు చెరో వికెట్ లభించింది.
టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా ఆరంభం నుంచే పరుగులు సాధించడం మొదలు పెట్టారు. గత మూడు టెస్టులకు విభిన్నంగా నాలుగో టెస్టులో పిచ్ ఉంది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పోర్లతో విరుచుపడ్డారు. అదే సమయంలో భారత వికెట్ కీపర్ శ్రీకర్ భారత్ పలు క్యాచ్ లను నెలపాలు చేశాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన అశ్విన్ ట్రావిస్ హెడ్ ను అవుట్ చేసి భారత్ కు తొలి బ్రేక్ ను అందించాడు. హెడ్ అవుటైన కాసేపటికే లబుషేన్ ను జడేజా పెవిలియన్ కు పంపించాడు. అనంతరం మరో వికెట్ పడకుండా జగ్రత్త పడ్డ స్మిత్, ఖవాజా లంచ్ బ్రేక్కు వెళ్లారు.
Also Read
- US-Iran: ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు.. ఫొటోలు విడుదల
- ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
- Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
- Rohit Sharma: "రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్కు ముందే తెలుసు?".. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్!
Read Also: MS Dhoni: చేపల వ్యాపారంలోకి ఎంఎస్ ధోని
లంచ్ తర్వాత ఖవాజా, స్మిత్ లు స్లోగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ముఖ్యంగా స్మిత్ 28 స్ట్రయిక్ రేట్ తో పరుగులు చేశాడు. భారత బౌలర్లకు వికెట్ తీసే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వలేదు. దాంతో రెండో సెషన్ లో భారత జట్టు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అయితే మూడో సెషన్ లో భారత్ కు రెండు వికెట్లు దక్కాయి.జడేజా బౌలింగ్ లో స్మిత్ వికెట్ల మీదుగా ఆడుకోగా.. కాసేపటికే హ్యాండ్స్ కాంబ్( 17 )ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఆందోళన నెలకొంది. 81వ ఓవర్ వరకు కూడా భారత బౌలర్లు ఆసీస్ను ఒత్తిడిలోకి నెట్టేందుకు బౌలింగ్ చేశారు.
కానీ, 81వ ఓవర్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త బందిని తీసుకున్నాడు. ఇక్కడ నుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఇబ్బంది పడ్డ ఖవాజా, గ్రీన్ లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ముఖ్యంగా కెమరూన్ గ్రీన్ ఫోర్లతో విరుచుకుడ్డారు. చివరి తొమ్మిది ఓవర్లలో ఆస్ట్రేలియా ఓవరకు 7 పరుగుల కంటే ఎక్కువ రన్స్ సాధించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ లో ఉస్మాన్ ఖవాజాకు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు.. ఫొటోలు విడుదల
-
ISRO: ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలేస్తున్నారు..? అసలు కారణాలు ఇవే..
-
Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
-
Rohit Sharma: “రోహిత్ రిటైర్మెంట్ గురించి విరాట్కు ముందే తెలుసు?”.. డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీ ఎమోషనల్!
-
Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?