Meditation: గర్భంతో ఉన్న వారు ధ్యానం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రెగ్నెన్సీపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగుతుంది.గర్భం దాల్చిన మొదటి నెల నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ లు , పౌష్టికాహారం తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. దీని ద్వారా పిల్ల బిడ్డ దాదాపు సురక్షితంగా ఉంటున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పేద మహిళలకు బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. అయితే మహిళలు ఈజీ డెలివరీ కోసం ఈ మధ్య యోగ లాంటివి కూడా చేస్తున్నారు. దీని వల్ల బిడ్డ పుట్టే సమయంలో నొప్పి తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక యోగ లాంటి వాటితో పాటు రోజుకు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే సుఖప్రసవం జరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. లోతైన ధ్యానం మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది.
Also Read: Singam Again: మా సౌత్ ‘సింగం’ కూడా కలిస్తే పాన్ ఇండియా సంభవం గ్యారెంటీ
Also Read
- India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పురిటినొప్పిని భరించగలమా లేదా అనే భయం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల ఆందోళన, పాపా పుడుతుందా? బాబు పుడతాడా? ఎలా ఉంటారు? తరువాత వారిని ఎలా పెంచాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ కలుగుతూ ఉంటాయి. ఇలాంటి ఒత్తిళ్లన్నింటికీ ధ్యానం ద్వారా పరిష్కారం లభిస్తుంది. ధ్యానం వల్ల ఎండార్ఫిన్ల విడుదల పెరుగుతుంది. దీని వల్ల నొప్పిని తట్టుకునే శక్తి వస్తుంది. ఆ కారణం చేత ప్రసవం సులభంగా జరుగుతుంది. ధ్యానం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు దరిచేరావు. గర్బధారయ సమయంలో ఒత్తిడి కారణంగా అడ్రినలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్ల విడుదల పెరుగుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. దీనిని ధ్యానం తగ్గిస్తుంది. ప్రసవానంతర డిప్రెషన్ చాలామందిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ధ్యానంతో ఈ అవరోధాన్ని కూడా అధిగమించవచ్చు. పిల్లలు పుట్టిన తరువాత వారికి పాలు ఇవ్వాలి. అయితే ధ్యానం చేసే వారిలో చనుబాలు సమృద్ధిగా ఉంటాయని అనేక పరిశోధనల్ల్లో వెల్లడైంది. కాబోయే తల్లులకు వివిధ రకాల ఆలోచనల వల్ల చిరాకు వస్తూ ఉంటుంది. నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే గర్భిణీలు క్రమం తప్పకుండా రోజుకు 15 నిమిషాలు అయినా ధ్యానం చేయాలి.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!