Meditation: గర్భంతో ఉన్న వారు ధ్యానం చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం ప్రెగ్నెన్సీపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరగుతుంది.గర్భం దాల్చిన మొదటి నెల నుంచే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ లు , పౌష్టికాహారం తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. దీని ద్వారా పిల్ల బిడ్డ దాదాపు సురక్షితంగా ఉంటున్నారు. ఇక ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పేద మహిళలకు బలవర్థకమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. అయితే మహిళలు ఈజీ డెలివరీ కోసం ఈ మధ్య యోగ లాంటివి కూడా చేస్తున్నారు. దీని వల్ల బిడ్డ పుట్టే సమయంలో నొప్పి తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇక యోగ లాంటి వాటితో పాటు రోజుకు కనీసం పదిహేను నిమిషాలు ధ్యానం చేస్తే సుఖప్రసవం జరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. లోతైన ధ్యానం మనసుకు కొత్త శక్తిని ఇస్తుంది.
Also Read: Singam Again: మా సౌత్ ‘సింగం’ కూడా కలిస్తే పాన్ ఇండియా సంభవం గ్యారెంటీ
Also Read
- Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
- Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
- Geetu Mohandas: "నేను రాసిందొకటి.. తీసిందొకటి".. టాక్సిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. కానీ..
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
పురిటినొప్పిని భరించగలమా లేదా అనే భయం, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పట్ల ఆందోళన, పాపా పుడుతుందా? బాబు పుడతాడా? ఎలా ఉంటారు? తరువాత వారిని ఎలా పెంచాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ కలుగుతూ ఉంటాయి. ఇలాంటి ఒత్తిళ్లన్నింటికీ ధ్యానం ద్వారా పరిష్కారం లభిస్తుంది. ధ్యానం వల్ల ఎండార్ఫిన్ల విడుదల పెరుగుతుంది. దీని వల్ల నొప్పిని తట్టుకునే శక్తి వస్తుంది. ఆ కారణం చేత ప్రసవం సులభంగా జరుగుతుంది. ధ్యానం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు దరిచేరావు. గర్బధారయ సమయంలో ఒత్తిడి కారణంగా అడ్రినలిన్, కార్టిసోల్ వంటి హార్మోన్ల విడుదల పెరుగుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. దీనిని ధ్యానం తగ్గిస్తుంది. ప్రసవానంతర డిప్రెషన్ చాలామందిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ధ్యానంతో ఈ అవరోధాన్ని కూడా అధిగమించవచ్చు. పిల్లలు పుట్టిన తరువాత వారికి పాలు ఇవ్వాలి. అయితే ధ్యానం చేసే వారిలో చనుబాలు సమృద్ధిగా ఉంటాయని అనేక పరిశోధనల్ల్లో వెల్లడైంది. కాబోయే తల్లులకు వివిధ రకాల ఆలోచనల వల్ల చిరాకు వస్తూ ఉంటుంది. నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే గర్భిణీలు క్రమం తప్పకుండా రోజుకు 15 నిమిషాలు అయినా ధ్యానం చేయాలి.
తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్వైడ్గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్కు గుడ్బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!