Man Sentenced: అనుకోకుండా చిన్నారి హత్య.. దోషికి 100 ఏళ్ల జైలు శిక్ష
Man Sentenced: ఓ వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు అమెరికాలోని ఓ న్యాయస్థానం అరుదైన తీర్పు ఇచ్చింది. ఓ వ్యక్తితో జరిగిన వివాదంలో తన వద్ద ఉన్న హ్యాండ్గన్తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదల కాగా.. అవతలి వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి తలలోకి దూసుకుపోయింది. అభం శుభం తెలియని ఒక చిన్నారి బలైంది. దీంతో అమెరికా కోర్టు వందేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. భారత సంతతికి చెందిన బాలిక(5) మృతికి కారణమైనందుకు 35 ఏళ్ల వ్యక్తికి 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2021లో లూసియానా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన మాయా పటేల్ మరణానికి కారణమైనందుకు నిందితుడికి ఈ శిక్ష విధించినట్లు స్థానిక మీడియా తెలిపింది.
మాంక్హౌస్ డ్రైవ్లోని ఓ హోటల్ను మృతురాలు మాయా పటేల్ తండ్రి స్నేహిల్ పటేల్, విమల్ అనే వ్యక్తి కలిసి నడిపిస్తున్నారు. మాయా కుటుంబం అదే హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది. హోటల్లో మాయా పటేల్ ఆడుతుండగా ఆమె తలలోకి ఓ బులెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీంతో మాయా మూడు రోజులు పాటు ఆస్పత్రిలోనే మృత్యువుతో పోరాడి 2021 మార్చి 23న ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే…ష్రేవ్పోర్ట్కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తి ఆ హోటల్లోని పార్కింగ్ వద్ద ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్ ఆవ్యక్తి పైకి ఎంఎం హ్యాండ్గన్ని ఎక్కుపెట్టారు. దీంతో విడుదలై బుల్లెట్ నుంచి సదరు వ్యక్తికి తప్పించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ హోటల్ గదిలో ఆడుకుంటున్న భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మాయాపటేల్ తలలోకి దూసుకుపోయింది. దీంతో మాయా పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
Also Read
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
Read Also: ALH Dhruv helicopter: ఎయిర్పోర్టులో కుప్పకూలిన కోస్ట్గార్డ్ హెలికాప్టర్ .. టేకాఫ్ అవుతుండగా..
ఈ నేపథ్యంలో జోసెఫ్ లీ స్మిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తిని జనవరిలోనే మాయా పటేల్ హత్య కేసులో జిల్లా కోర్టు దోషిగా తేల్చింది. దీంతో జిల్లా కోర్టు జడ్జి జాన్ డీ మోస్లే.. స్మిత్కు 60 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అలాగే న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు మరో 20 ఏళ్లు, ఇతర కారణాలతో మరో ఇరవై సంవత్సరాల శిక్షను విధించారు. నిందితుడు స్మిత్కు మొత్తం 100 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!