US Baghdad Drone Strike: ఇరాన్పై అమెరికా ప్రతీకారం.. హిజ్బుల్లా కమాండర్ హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Baghdad Drone Strike: ముగ్గురు సైనికుల మరణం తర్వాత ఇరాన్ అనుకూల మిలీషియాపై అమెరికా రక్తపాత దాడులను కొనసాగిస్తోంది. తాజా దాడిలో, ఇరాక్ రాజధాని బాగ్దాద్లో డ్రోన్ దాడిలో కారులో ప్రయాణిస్తున్న ఇరాన్ అనుకూల ఖతైబ్ హిజ్బుల్లా టాప్ కమాండర్ను అమెరికా చంపేసింది. హిజ్బుల్లా కమాండర్పై ఈ దాడికి అమెరికా తన రహస్య AGM-114R9X హెల్ఫైర్ క్షిపణిని ఉపయోగించిందని సమాచారం. ఈ క్షిపణితో అమెరికా అల్ఖైదా నాయకుడు అమాన్ అల్ జవహిరిని హతమార్చింది. ఈ క్షిపణికి కత్తిలా కనిపించే బ్లేడ్ను అమర్చినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రాలు చూపిస్తున్నాయి. ఇరాక్లోని మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా సైన్యం ప్రకటింది. జోర్డాన్లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగానే తాము ఈ దాడి చేశామని వివరించింది.
Read Also: Bomb Threats: చెన్నైలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తల్లిదండ్రుల పరుగులు
Also Read
- Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
- Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
యూఎస్ దళాలపై దాడికి ప్రణాళిక, దాడికి కతైబ్ హిజ్బుల్లా కమాండర్ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా తెలిపింది. ఈ ఘటనలో సామాన్య పౌరులు మరణించిన ఆనవాళ్లు లేవని ఓ సైనికాధికారి వెల్లడించారు. కేవలం కారు మాత్రమే దగ్ధమైనట్లు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బహుశా ఆర్9ఎక్స్ అనే హెల్ఫైర్ రకం క్షిపణిని ఉపయోగించి ఉంటారని ఓ అమెరికా మాజీ సైనికాధికారి తెలిపారు. పేలుడు తీవ్రత ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2020లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక కమాండర్ ఖాసీమ్ సులేమానీని సైతం అమెరికా ఇదే తరహాలో హతమార్చింది.
Read Also: Pakistan Elections 2024: పాక్లో కొనసాగుతున్న పోలింగ్.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
రహస్య క్షిపణి గురించి అమెరికా చెప్పలేదు..
ది డ్రైవ్ నివేదిక ప్రకారం.. అమెరికా R9X క్షిపణిని ఉపయోగించింది. దానికి బ్లేడ్లు జోడించబడ్డాయి. సరిగ్గా అలాంటి దాడుల కోసమే ఈ క్షిపణిని రూపొందించారు. అందులో అమర్చిన బ్లేడ్ కారులో లేదా ఇతర వాహనంలో కూర్చున్న లక్ష్యాన్ని చంపేస్తుంది. ఇది పరిసరాలకు చాలా తక్కువ నష్టం కలిగిస్తుంది. బరాక్ ఒబామా హయాంలో ఈ క్షిపణి తయారు చేయబడింది. ఈ క్షిపణి విషయంలో అమెరికా ఇంకా మౌనంగానే ఉంది. యూఎస్ మిలిటరీ అనేక ఇతర రకాల హెల్ఫైర్ క్షిపణుల ఉనికిని బహిరంగంగా అంగీకరించింది. ఈ క్షిపణులను డ్రోన్ల నుంచి మాత్రమే ప్రయోగిస్తారు. దీనిని అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ లేదా CIA నిర్వహిస్తుంది. ఈ క్షిపణి సాయంతో అమెరికా ఇప్పటి వరకు అల్ ఖైదాతో పాటు పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో, సీఐఏ ఈ క్షిపణి ద్వారా అల్ ఖైదా టాప్ కమాండర్ అమాన్ అల్ జవహిరిని చంపింది.
తాజావార్తలు
-
Free LPG Cylinders Scheme: గుడ్న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!