US Baghdad Drone Strike: ఇరాన్పై అమెరికా ప్రతీకారం.. హిజ్బుల్లా కమాండర్ హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Baghdad Drone Strike: ముగ్గురు సైనికుల మరణం తర్వాత ఇరాన్ అనుకూల మిలీషియాపై అమెరికా రక్తపాత దాడులను కొనసాగిస్తోంది. తాజా దాడిలో, ఇరాక్ రాజధాని బాగ్దాద్లో డ్రోన్ దాడిలో కారులో ప్రయాణిస్తున్న ఇరాన్ అనుకూల ఖతైబ్ హిజ్బుల్లా టాప్ కమాండర్ను అమెరికా చంపేసింది. హిజ్బుల్లా కమాండర్పై ఈ దాడికి అమెరికా తన రహస్య AGM-114R9X హెల్ఫైర్ క్షిపణిని ఉపయోగించిందని సమాచారం. ఈ క్షిపణితో అమెరికా అల్ఖైదా నాయకుడు అమాన్ అల్ జవహిరిని హతమార్చింది. ఈ క్షిపణికి కత్తిలా కనిపించే బ్లేడ్ను అమర్చినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రాలు చూపిస్తున్నాయి. ఇరాక్లోని మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా సైన్యం ప్రకటింది. జోర్డాన్లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగానే తాము ఈ దాడి చేశామని వివరించింది.
Read Also: Bomb Threats: చెన్నైలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తల్లిదండ్రుల పరుగులు
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
యూఎస్ దళాలపై దాడికి ప్రణాళిక, దాడికి కతైబ్ హిజ్బుల్లా కమాండర్ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా తెలిపింది. ఈ ఘటనలో సామాన్య పౌరులు మరణించిన ఆనవాళ్లు లేవని ఓ సైనికాధికారి వెల్లడించారు. కేవలం కారు మాత్రమే దగ్ధమైనట్లు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బహుశా ఆర్9ఎక్స్ అనే హెల్ఫైర్ రకం క్షిపణిని ఉపయోగించి ఉంటారని ఓ అమెరికా మాజీ సైనికాధికారి తెలిపారు. పేలుడు తీవ్రత ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2020లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక కమాండర్ ఖాసీమ్ సులేమానీని సైతం అమెరికా ఇదే తరహాలో హతమార్చింది.
Read Also: Pakistan Elections 2024: పాక్లో కొనసాగుతున్న పోలింగ్.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
రహస్య క్షిపణి గురించి అమెరికా చెప్పలేదు..
ది డ్రైవ్ నివేదిక ప్రకారం.. అమెరికా R9X క్షిపణిని ఉపయోగించింది. దానికి బ్లేడ్లు జోడించబడ్డాయి. సరిగ్గా అలాంటి దాడుల కోసమే ఈ క్షిపణిని రూపొందించారు. అందులో అమర్చిన బ్లేడ్ కారులో లేదా ఇతర వాహనంలో కూర్చున్న లక్ష్యాన్ని చంపేస్తుంది. ఇది పరిసరాలకు చాలా తక్కువ నష్టం కలిగిస్తుంది. బరాక్ ఒబామా హయాంలో ఈ క్షిపణి తయారు చేయబడింది. ఈ క్షిపణి విషయంలో అమెరికా ఇంకా మౌనంగానే ఉంది. యూఎస్ మిలిటరీ అనేక ఇతర రకాల హెల్ఫైర్ క్షిపణుల ఉనికిని బహిరంగంగా అంగీకరించింది. ఈ క్షిపణులను డ్రోన్ల నుంచి మాత్రమే ప్రయోగిస్తారు. దీనిని అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ లేదా CIA నిర్వహిస్తుంది. ఈ క్షిపణి సాయంతో అమెరికా ఇప్పటి వరకు అల్ ఖైదాతో పాటు పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో, సీఐఏ ఈ క్షిపణి ద్వారా అల్ ఖైదా టాప్ కమాండర్ అమాన్ అల్ జవహిరిని చంపింది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!