US Baghdad Drone Strike: ఇరాన్పై అమెరికా ప్రతీకారం.. హిజ్బుల్లా కమాండర్ హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Baghdad Drone Strike: ముగ్గురు సైనికుల మరణం తర్వాత ఇరాన్ అనుకూల మిలీషియాపై అమెరికా రక్తపాత దాడులను కొనసాగిస్తోంది. తాజా దాడిలో, ఇరాక్ రాజధాని బాగ్దాద్లో డ్రోన్ దాడిలో కారులో ప్రయాణిస్తున్న ఇరాన్ అనుకూల ఖతైబ్ హిజ్బుల్లా టాప్ కమాండర్ను అమెరికా చంపేసింది. హిజ్బుల్లా కమాండర్పై ఈ దాడికి అమెరికా తన రహస్య AGM-114R9X హెల్ఫైర్ క్షిపణిని ఉపయోగించిందని సమాచారం. ఈ క్షిపణితో అమెరికా అల్ఖైదా నాయకుడు అమాన్ అల్ జవహిరిని హతమార్చింది. ఈ క్షిపణికి కత్తిలా కనిపించే బ్లేడ్ను అమర్చినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రాలు చూపిస్తున్నాయి. ఇరాక్లోని మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా సైన్యం ప్రకటింది. జోర్డాన్లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగానే తాము ఈ దాడి చేశామని వివరించింది.
Read Also: Bomb Threats: చెన్నైలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తల్లిదండ్రుల పరుగులు
Also Read
- China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
యూఎస్ దళాలపై దాడికి ప్రణాళిక, దాడికి కతైబ్ హిజ్బుల్లా కమాండర్ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా తెలిపింది. ఈ ఘటనలో సామాన్య పౌరులు మరణించిన ఆనవాళ్లు లేవని ఓ సైనికాధికారి వెల్లడించారు. కేవలం కారు మాత్రమే దగ్ధమైనట్లు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బహుశా ఆర్9ఎక్స్ అనే హెల్ఫైర్ రకం క్షిపణిని ఉపయోగించి ఉంటారని ఓ అమెరికా మాజీ సైనికాధికారి తెలిపారు. పేలుడు తీవ్రత ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2020లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక కమాండర్ ఖాసీమ్ సులేమానీని సైతం అమెరికా ఇదే తరహాలో హతమార్చింది.
Read Also: Pakistan Elections 2024: పాక్లో కొనసాగుతున్న పోలింగ్.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
రహస్య క్షిపణి గురించి అమెరికా చెప్పలేదు..
ది డ్రైవ్ నివేదిక ప్రకారం.. అమెరికా R9X క్షిపణిని ఉపయోగించింది. దానికి బ్లేడ్లు జోడించబడ్డాయి. సరిగ్గా అలాంటి దాడుల కోసమే ఈ క్షిపణిని రూపొందించారు. అందులో అమర్చిన బ్లేడ్ కారులో లేదా ఇతర వాహనంలో కూర్చున్న లక్ష్యాన్ని చంపేస్తుంది. ఇది పరిసరాలకు చాలా తక్కువ నష్టం కలిగిస్తుంది. బరాక్ ఒబామా హయాంలో ఈ క్షిపణి తయారు చేయబడింది. ఈ క్షిపణి విషయంలో అమెరికా ఇంకా మౌనంగానే ఉంది. యూఎస్ మిలిటరీ అనేక ఇతర రకాల హెల్ఫైర్ క్షిపణుల ఉనికిని బహిరంగంగా అంగీకరించింది. ఈ క్షిపణులను డ్రోన్ల నుంచి మాత్రమే ప్రయోగిస్తారు. దీనిని అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ లేదా CIA నిర్వహిస్తుంది. ఈ క్షిపణి సాయంతో అమెరికా ఇప్పటి వరకు అల్ ఖైదాతో పాటు పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో, సీఐఏ ఈ క్షిపణి ద్వారా అల్ ఖైదా టాప్ కమాండర్ అమాన్ అల్ జవహిరిని చంపింది.
తాజావార్తలు
-
China: డ్రాగన్ కొత్త ఎత్తుగడ.. భారత్ సరిహద్దులో కొత్త కారిడార్కు ప్రణాళిక
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!