US Baghdad Drone Strike: ఇరాన్పై అమెరికా ప్రతీకారం.. హిజ్బుల్లా కమాండర్ హతం
US Baghdad Drone Strike: ముగ్గురు సైనికుల మరణం తర్వాత ఇరాన్ అనుకూల మిలీషియాపై అమెరికా రక్తపాత దాడులను కొనసాగిస్తోంది. తాజా దాడిలో, ఇరాక్ రాజధాని బాగ్దాద్లో డ్రోన్ దాడిలో కారులో ప్రయాణిస్తున్న ఇరాన్ అనుకూల ఖతైబ్ హిజ్బుల్లా టాప్ కమాండర్ను అమెరికా చంపేసింది. హిజ్బుల్లా కమాండర్పై ఈ దాడికి అమెరికా తన రహస్య AGM-114R9X హెల్ఫైర్ క్షిపణిని ఉపయోగించిందని సమాచారం. ఈ క్షిపణితో అమెరికా అల్ఖైదా నాయకుడు అమాన్ అల్ జవహిరిని హతమార్చింది. ఈ క్షిపణికి కత్తిలా కనిపించే బ్లేడ్ను అమర్చినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రాలు చూపిస్తున్నాయి. ఇరాక్లోని మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా సైన్యం ప్రకటింది. జోర్డాన్లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగానే తాము ఈ దాడి చేశామని వివరించింది.
Read Also: Bomb Threats: చెన్నైలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తల్లిదండ్రుల పరుగులు
Also Read
- RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
- Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
- Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
యూఎస్ దళాలపై దాడికి ప్రణాళిక, దాడికి కతైబ్ హిజ్బుల్లా కమాండర్ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా తెలిపింది. ఈ ఘటనలో సామాన్య పౌరులు మరణించిన ఆనవాళ్లు లేవని ఓ సైనికాధికారి వెల్లడించారు. కేవలం కారు మాత్రమే దగ్ధమైనట్లు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బహుశా ఆర్9ఎక్స్ అనే హెల్ఫైర్ రకం క్షిపణిని ఉపయోగించి ఉంటారని ఓ అమెరికా మాజీ సైనికాధికారి తెలిపారు. పేలుడు తీవ్రత ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2020లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక కమాండర్ ఖాసీమ్ సులేమానీని సైతం అమెరికా ఇదే తరహాలో హతమార్చింది.
Read Also: Pakistan Elections 2024: పాక్లో కొనసాగుతున్న పోలింగ్.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
రహస్య క్షిపణి గురించి అమెరికా చెప్పలేదు..
ది డ్రైవ్ నివేదిక ప్రకారం.. అమెరికా R9X క్షిపణిని ఉపయోగించింది. దానికి బ్లేడ్లు జోడించబడ్డాయి. సరిగ్గా అలాంటి దాడుల కోసమే ఈ క్షిపణిని రూపొందించారు. అందులో అమర్చిన బ్లేడ్ కారులో లేదా ఇతర వాహనంలో కూర్చున్న లక్ష్యాన్ని చంపేస్తుంది. ఇది పరిసరాలకు చాలా తక్కువ నష్టం కలిగిస్తుంది. బరాక్ ఒబామా హయాంలో ఈ క్షిపణి తయారు చేయబడింది. ఈ క్షిపణి విషయంలో అమెరికా ఇంకా మౌనంగానే ఉంది. యూఎస్ మిలిటరీ అనేక ఇతర రకాల హెల్ఫైర్ క్షిపణుల ఉనికిని బహిరంగంగా అంగీకరించింది. ఈ క్షిపణులను డ్రోన్ల నుంచి మాత్రమే ప్రయోగిస్తారు. దీనిని అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ లేదా CIA నిర్వహిస్తుంది. ఈ క్షిపణి సాయంతో అమెరికా ఇప్పటి వరకు అల్ ఖైదాతో పాటు పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో, సీఐఏ ఈ క్షిపణి ద్వారా అల్ ఖైదా టాప్ కమాండర్ అమాన్ అల్ జవహిరిని చంపింది.
తాజావార్తలు
-
Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!