US India Drone Deal: భారత్కు సాయుధ డ్రోన్లను విక్రయించడానికి యూఎస్ అనుమతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US India Drone Deal: అమెరికా, భారత్ మధ్య ప్రిడేటర్ డ్రోన్లపై ఒప్పందం గురించి కీలక అప్డేట్ వచ్చింది. దాదాపు 4 బిలియన్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భారతదేశానికి ఎంక్యూ-9బీ సీ గార్డియన్ డ్రోన్ల అమ్మకానికి యూఎస్ అనుమతినిచ్చింది. డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఈ రోజు సాధ్యమయ్యే విక్రయాల గురించి యూఎస్ కాంగ్రెస్కు తెలియజేస్తుంది. ఈ ప్రతిపాదిత విక్రయం అమెరికా-భారత వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేయడానికి, రాజకీయ స్థిరత్వం, శాంతికి ముఖ్యమైన శక్తిగా కొనసాగుతున్న ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడంలో సహాయం చేయడం ద్వారా యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం, జాతీయ భద్రతా లక్ష్యాలకు మద్దతు ఇస్తుందని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది.గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా 31 ఎంక్యూ-9బీ స్కై గార్డియన్ డ్రోన్లను కొనుగోలు చేయాలని భారత్ ప్రతిపాదించింది. బైడెన్ సర్కారు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం ఒక మైలురాయిగా నిలుస్తుంది. బైడెన్ సర్కారు భారతదేశానికి 31 ప్రిడేటర్ డ్రోన్లను అందించడానికి నోటిఫికేషన్ జారీ చేయవచ్చని అమెరికన్ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Jharkhand: 23 ఏళ్ల చరిత్రలో ముగ్గురు సీఎంలు అరెస్ట్.. ఎవరెవరంటే..!?
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన నేపథ్యంలో అమెరికా పార్లమెంట్ ఈ ఒప్పందాన్ని నిలిపివేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అమెరికాపై సర్వత్రా విమర్శలు మొదలయ్యాయి. ఇది మాత్రమే కాదు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా తన ఆధిపత్యాన్ని వేగంగా పెంచుకుంటున్న వేళ భారతదేశంతో యూఎస్ స్నేహంపై ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. చైనాను అడ్డుకునేందుకు ఈ ప్రాంతంలో భారత్ తనకు పెద్ద మిత్రదేశమని అమెరికా చెబుతోంది. డ్రోన్ ఒప్పందాన్ని నిలిపివేయడం అమెరికా స్నేహభావంపై ప్రశ్నలు తలెత్తడానికి దారితీసింది. ఈ డ్రోన్లు అధిక ఎత్తులో, ఎక్కువ సమయం పాటు ప్రయాణించే సాంకేతికతను కలిగి ఉంటాయి. వీటిలో 15 డ్రోన్లను భారత నావికాదళానికి, మిగిలిన 8 భారత సైన్యం, వైమానిక దళానికి ఇవ్వబడుతాయి.
గత 10 ఏళ్లలో భారత్-అమెరికా రక్షణ భాగస్వామ్యం గణనీయంగా బలపడిందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ డ్రోన్ ఒప్పందం ఈ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుంది. అమెరికా చట్టాల ప్రకారం ఆయుధ ఒప్పందానికి పార్లమెంటు ఆమోదం అవసరమని, పార్లమెంటు సభ్యులతో మాట్లాడిన తర్వాతే అధికారిక ప్రకటన వెలువడుతుందని స్పష్టం చేశారు. జీఈ-414 ఇంజిన్కు సంబంధించిన ఒప్పందం పురోగతిలో ఉందని, దాని సమాచారాన్ని ఉన్నత స్థాయిలో మోడీ ప్రభుత్వానికి అందించినట్లు జనరల్ అటామిక్ కంపెనీ కూడా తెలియజేసింది. ఈ డ్రోన్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ ఒప్పందాన్ని భారతదేశం, అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు పర్యవేక్షిస్తున్నారు.
Read Also: IND vs ENG: విశాఖలో మొదలైన క్రికెట్ ఫీవర్.. సిరీస్లో నిలవాలంటే గెలవాల్సిందే!
భారత నౌకాదళం ఇప్పటికే రెండు సీ గార్డియన్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. భారతదేశం, అమెరికా ఈ ప్రతిపాదిత ఒప్పందంలో ధరతో సహా వివిధ అంశాలను పరిశీలిస్తున్నాయని మునుపటి నివేదికలు తెలిపాయి. అయితే సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూని చంపడానికి భారతదేశం కుట్ర విఫలమైందని అమెరికా ఆరోపించిన తర్వాత ఈ చర్చల ప్రక్రియ మందగిస్తోంది. కోట్లాది రూపాయల డీల్పై ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, అయితే డ్రోన్ కొనుగోలు ఎప్పుడు ఖరారు అవుతుందనే దానిపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని భారత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇంటర్-గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ కింద యూఎస్ నుంచి 31 MQ-9బీ ప్రిడేటర్ సాయుధ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఒక మైలురాయి ఒప్పందాన్ని భారతదేశం ఎప్పటినుంచో పరిశీలిస్తోంది. ప్రధాన యూఎస్ డిఫెన్స్ కంపెనీ జనరల్ అటామిక్స్ నుండి డ్రోన్ల కొనుగోలు కోసం భారతదేశం అభ్యర్థన లేఖకు వాషింగ్టన్ ప్రతిస్పందన తర్వాత యూఎస్, భారతదేశ అధికారులు కొనుగోలుపై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వెంబడి త్రివిధ దళాల నిఘా నెట్వర్క్ను బలోపేతం చేయడానికి భారత్ ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!