Trump: హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా వైమానిక దాడులు.. 19 మంది మృతి
- హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా వైమానిక దాడులు
- ఇరాన్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు
- హౌతీ పొలిటికల్ బ్యూరో ఈ దాడులను "యుద్ధ నేరాలు"గా అభివర్ణించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యెమెన్లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా వరుస దాడులకు పాల్పడింది. హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తున్న దృష్ట్యా అమెరికా ఈ చర్య తీసుకుంది. యెమెన్ రాజధాని సనాపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారని హౌతీల ఆధీనంలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Also Read:Uttam Kumar Reddy : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయం ఇది
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
హౌతీ పొలిటికల్ బ్యూరో ఈ దాడులను “యుద్ధ నేరాలు”గా అభివర్ణించింది. ఉత్తర ప్రావిన్స్ సాదాలో అమెరికా దాడులు కొనసాగుతున్నాయని తెలిపింది. పెరుగుతున్న ఉద్రిక్తతలను ఎదుర్కొనేందుకు యెమెన్ సాయుధ దళాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపింది. హౌతీ తిరుగుబాటుదారులు తమ దాడులను ఆపకపోతే, “మునుపెన్నడూ చూడని విధంగా నరకం” ఉంటుందని అమెరికా హెచ్చరించింది. హౌతీ తిరుగుబాటుదారులకు మద్దతు ఇస్తున్న ఇరాన్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇకపై తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వడం ఆపేయాలని హెచ్చరించాడు.
Also Read:Uttam Kumar Reddy : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయం ఇది
యెమెన్ రాజధాని సనాపై శనివారం వైమానిక దాడులకు ఆదేశించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హౌతీ తిరుగుబాటుదారులు సముద్ర కారిడార్ను లక్ష్యంగా చేసుకోవడం ఆపే వరకు మేము మా దాడులను కొనసాగిస్తాము అని ఆయన అన్నారు. “ప్రపంచ జలమార్గాల గుండా అమెరికన్ వాణిజ్య, నావికాదళ నౌకలు స్వేచ్ఛగా కదలకుండా ఏ ఉగ్రవాద సంస్థ కూడా నిరోధించలేదు” అని ట్రంప్ ఇంటర్నెట్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. గత దశాబ్దంలో యెమెన్లో ఎక్కువ భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న సాయుధ ఉద్యమమైన హౌతీలు, నవంబర్ 2023 నుండి షిప్పింగ్ను లక్ష్యంగా చేసుకుని 100 కి పైగా దాడులను నిర్వహించారు. ఇది ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించింది.
CENTCOM Forces Launch Large Scale Operation Against Iran-Backed Houthis in Yemen
On March 15, U.S. Central Command initiated a series of operations consisting of precision strikes against Iran-backed Houthi targets across Yemen to defend American interests, deter enemies, and… pic.twitter.com/u5yx8WneoG
— U.S. Central Command (@CENTCOM) March 15, 2025
తాజావార్తలు
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
-
NBK 112 : బాలయ్య -కొరటాల మాస్ సినిమా కాదు.. అంతకుమించి
-
Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
-
Lenin movie trailer : లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్.. అయ్యగారు ఆన్ ట్రాక్
-
Stokes-Archer: వికెట్ పడినా సెలబ్రేషన్స్ చేసుకొని ఆర్చర్.. స్టోక్స్ అసహనం.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!