Delhi: గ్రాడ్యుయేట్ తండ్రి ఘాతుకం.. ఒకేసారి కవల ఆడపిల్లలు పుట్టారని హత్య
- ఢిల్లీలో గ్రాడ్యుయేట్ తండ్రి ఘాతుకం
- ఒకేసారి కవల ఆడపిల్లలు పుట్టారని హత్య
- నిందితుడు నీరజ్ను అరెస్ట్ చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతడు ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చదివాడు. ఎంతో ఉన్నతంగా ఆలోచించాల్సిన వాడు దుర్మార్గంగా ఆలోచించాడు. తన ఇంట్లోకి ఒకేసారి ఇద్దరు కుమార్తెలు వస్తే.. సంతోషించాల్సిన వాడు కిరాతకంగా మారాడు. ఇద్దరు ఆడ శిశువులను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Poonam Kaur: త్రివిక్రమ్ నాకేం చేశాడో వేరే వాళ్ళ చేత ఏం చేయించాడో అతన్నే అడగండి!
Also Read
- UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
- India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
నీరజ్ సోలంకి(32).. ఓటర్ ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో ఉంటాడు. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ చదివాడు. అతడు భార్య హర్యానాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. అయితే నీరజ్కి ఆడ పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. కుమారుడు కావాలని ఆశ పడ్డాడు. అయితే బాలింత ఆస్పత్రిలో ఉండగా.. శిశువులను ఢిల్లీకి తీసుకొచ్చి.. జూన్ 3న చంపేసి ఇంటి సమీపంలో పాతిపెట్టాడు. పిల్లలు అనారోగ్యంతో చనిపోయారని భార్యకు అబద్ధం చెప్పాడు. పిల్లలు చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.
ఇది కూడా చదవండి: Fire Accident: ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని ఓ కమర్షియల్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర్టు అనుమతితో జూన్ 5న మృతదేహాలను వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు. మంగోల్పురిలోని ఎస్జీఎం ఆసుపత్రి మార్చురీలో ఉంచినట్లు డీసీపీ గోయెల్ తెలిపారు. కొడుకు పుట్టలేదని.. ఆడ శిశువులను చంపినట్లు వెల్లడించారు. నిందితుడు నీరజ్ సోలంకిని హర్యానాలోని రోహ్తక్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. పూత్ కలాన్ గ్రామ సమీపంలోని తాత్కాలిక శ్మశానవాటిక ఆవరణలో శిశువుల మృతదేహాలను స్థానికులు కనుగొన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) అమిత్ గోయెల్ స్పష్టం చేశారు. అనారోగ్యంతో చనిపోయారని భార్యకు మాయమాటలు చెప్పి.. ఢిల్లీకి సజీవంగా తీసుకొచ్చి చంపేసినట్లు పోలీస్ అధికారి వివరించారు. సోలంకి సోదరి, సోదరుడు పరారీలో ఉన్నారని.. అతని తల్లి పక్షవాతానికి గురైందన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను కూడా విచారించే అవకాశం ఉందని మరో పోలీసు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Russia: భారతీయులను మా ఆర్మీలో ఎన్నడూ కోరుకోలేదు..
సోలంకి, అతని కుటుంబం సభ్యులంతా రాత్రంతా శిశువులకు ఆహారం ఇవ్వకపోవడం వల్లే వారు చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువులపై శవపరీక్షలో ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించలేకపోయారు. అయితే తదుపరి విచారణ కోసం అంతర్గత అవయవాలు భద్రపరిచారు. రోహ్తక్కు చెందిన శిశువు తల్లి.. సోలంకిని వివాహం చేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. 2022లో అత్తమామలతో ఆమె సంబంధం చెడిపోయింది. వరకట్నం కోసం క్రమం తప్పకుండా వేధించేవారని బాధితురాలు పోలీసులు తెలిపింది. సోలంకి, కుటుంబ సభ్యులు తనను లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని కోరారని, అందుకు నిరాకరించినట్లు పోలీసులకు తెలిపింది. పోస్టుమార్టం అనంతరం చిన్నారుల మృతదేహాలను తల్లికి అప్పగించారు. సోలంకిపై హత్యానేరం కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
-
India Women vs England Women: అబ్బాయిలు పరువు తీస్తే.. అమ్మాయిలు గర్జించారు.. ఇంగ్లండ్పై భారత్ చారిత్రక విజయం
-
Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!