UPSC Changes Exam Pattern: ఆ మోసాలకు చెక్ పెట్టేందుకు యూపీఎస్సీ పరీక్షా విధానంలో కీలక మార్పులు..
- యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలలో సాంకేతిక సేవలు.
- PSU ల నుండి బిడ్లను ఆహ్వానించారు.
- యూపీఎస్సీ 1926 అక్టోబర్ 1న ఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC Changes Exam Pattern: IAS పూజా ఖేద్కర్, నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET) వివాదం మధ్య యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తన పరీక్షా విధానంలో పెద్ద మార్పు చేయబోతోంది. పరీక్షల్లో చీటింగ్లు, అభ్యర్థుల మోసం కేసులను నివారించడానికి ఆధార్ ఆధారిత వేలిముద్రలు, ముఖ గుర్తింపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కూడిన కెమెరాలు వంటి సాంకేతిక చర్యలను యూపీఎస్సీ పరిశీలిస్తోంది. కొన్ని అందిన నివేదికల ప్రకారం.. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలలో సాంకేతిక సేవలను అందించడానికి PSU ల నుండి బిడ్లను ఆహ్వానించారు. ఈ విషయంలో కమిషన్ జారీ చేసిన టెండర్లో ఆధార్ ఆధారిత వేలిముద్ర ప్రామాణీకరణ లేదా డిజిటల్ వేలిముద్ర క్యాప్చర్, అభ్యర్థుల ముఖ గుర్తింపు, ఇ-అడ్మిట్ కార్డ్ల క్యూఆర్ కోడ్ స్కానింగ్, AI ఆధారిత సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ ఉన్నాయి. ఇది కాకుండా.. సర్వీస్ ప్రొవైడర్ తగిన మానవ వనరులను కూడా అందించాలి.
Heavy Rain: వడోదరలో దంచికొట్టిన వర్షం.. రోడ్ల మీదకొస్తున్న మొసళ్లు
Also Read
- 12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
- Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!
పరీక్ష షెడ్యూల్, పరీక్షా కేంద్రాల జాబితా, అభ్యర్థుల సంఖ్య వంటి సమాచారాన్ని పరీక్షకు 2 లేదా 3 వారాల ముందు సర్వీస్ ప్రొవైడర్ లకు అందజేస్తామని, దాంతో ప్రిపరేషన్ను పూర్తి చేయవచ్చని యూపీఎస్సీ తెలిపింది. ఇది వేలిముద్ర ప్రమాణీకరణ, ముఖ గుర్తింపు కోసం పరీక్షకు 7 రోజుల ముందు అభ్యర్థుల వివరాలను (పేరు, రోల్ నంబర్, ఫోటో మొదలైనవి) కూడా అందిస్తుంది. మోసం, ఫోర్జరీ, మరే వివిధ మోస మార్గాలను నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు యూపీఎస్సీ తెలిపింది.
Maldives – India: మాల్దీవులకు భారత్ భారీ షాక్.. దురహంకారానికి కళ్లే
మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ పలు కారణాలతో వివాదంలో చిక్కుకున్నారు . శిక్షణ సమయంలో కారు, వసతి, ప్రత్యేక గదిని డిమాండ్ చేయడం ద్వారా ఆమె వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత నకిలీ సర్టిఫికెట్లు కూడా తయారు చేసినట్లు తేలింది. అలాగే కోట్లాది రూపాయల ఆస్తులున్నప్పటికీ వెనుకబడిన తరగతుల నాన్ క్రీమీలేయర్ కేటగిరీలో పరీక్షకు హాజరయ్యారని వెల్లడించారు. ఇక కొంత విచారణ నేపథ్యంలో ఆమె శిక్షణ రద్దు చేసారు. ప్రస్తుతం అదృశ్యమయ్యింది.
Denmarks queen mary: డెన్మార్క్ క్వీన్ మేరీని ఢీకొట్టిన స్కూటర్.. వీడియో వైరల్
యూపీఎస్సీ అక్టోబర్ 1, 1926న ఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో స్థాపించబడింది. ఇది భారతదేశం కేంద్ర ఏజెన్సీ, రాజ్యాంగ హోదాను పొందింది. ఇది ప్రభుత్వ సర్వీసుల్లో రిక్రూట్మెంట్ కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) వంటి పరీక్షలను నిర్వహిస్తుంది. యూపీఎస్సీ ప్రతి సంవత్సరం నిర్వహించే 24 వేర్వేరు పరీక్షలకు 26 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారు. వీరిలో దాదాపు 10 లక్షల మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్నారు.
తాజావార్తలు
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!