UP: ఝాన్సీ ఆసుపత్రి అగ్నిప్రమాదంపై విచారణ.. కమిటీ ఏర్పాటు
- ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్వార్డ్లో అగ్ని ప్రమాదం
- 10 మంది చిన్నారులు మృతి
- ప్రాథమిక విచారణలో షార్ట్సర్క్యూట్ అని తేల్చిన అధికారులు
- ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్
- విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలోని మెడికల్ కాలేజీ చైల్డ్వార్డ్లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 16 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. కాగా.. ఈ ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏడు రోజుల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ బృందానికి డీజీఎంఈ నేతృత్వం వహిస్తారు.
Read Also: Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి భాజాలు.. అసలు నిజం ఇదే!
Also Read
ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్ ప్రాంతంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో మహారాణి లక్ష్మీ బాయి మెడికల్ కాలేజీ ఒకటి. ఈ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియు)లో శుక్రవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. మంటల్లో 10 మంది చిన్నారులు చనిపోయారు. ఈ ఘటనలో మరో 16 మంది చిన్నారులు గాయపడి ప్రాణాలతో పోరాడుతున్నారు. మంటలు చెలరేగిన వార్డులో మొత్తం 55 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన అనంతరం ఆస్పత్రి పాలకవర్గం నిర్లక్ష్యం, ఆస్పత్రిలో ఉంచిన అగ్నిమాపక పరికరాలపై చర్చ సాగింది. ఆసుపత్రిలో మంటలను ఆర్పే పరికరాల గడువు ముగిసిందని.. అలారంలు తప్పుగా ఉన్నాయని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Read Also: Health Benefits: ఈ జ్యూస్ అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా
ఈ ఘటన అనంతరం.. యూపీ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ‘యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పిల్లలు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తోంది. మా సిబ్బంది, వైద్యులు మరియు రెస్క్యూ బృందాలు పిల్లలను రక్షించడానికి ధైర్యంగా పనిచేశాయి. వైద్య కళాశాలలో అగ్నిమాపక పరికరాలన్నీ బాగానే ఉన్నాయి. ఫిబ్రవరిలో ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించారు. జూన్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు.’ అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?