Bullet Train: 2026 నాటికి అందుబాటులోకి బుల్లెట్ రైలు: అశ్వినీ వైష్ణవ్
Indias First Bullet Train Update: భారత దేశంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ విషయంపై తాజాగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. 2026 నాటికి బుల్లెట్ రైలు పట్టాలపై పరుగులు పెడుతుందని రైల్వే మంత్రి చెప్పారు. మంగళవారం ‘రైజింగ్ భారత్ సమ్మిట్’లో పాల్గొన్న అశ్వినీ వైష్ణవ్.. పలు కేంద్ర ప్రాజెక్టుల పురోగతిపై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబై మధ్య నిర్మిస్తున్న తొలి బుల్లెట్ రైలు సర్వీసును 2026 నాటికి ప్రారంభిస్తామని తెలిపారు.
‘బుల్లెట్ రైలు కోసం 500 కిమీల ప్రాజెక్టును నిర్మించేందుకు పలు దేశాలకు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. భారత్ మాత్రం 8-10 సంవత్సరాల్లోనే పూర్తిచేయనుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో బుల్లెట్ రైలు ప్రాజెక్టును పూర్తిచేస్తాం. 2026 నాటికి బుల్లెట్ రైలు పట్టాలెక్కనుంది. ముందుగా గుజరాత్లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు నడపనున్నాం. 2028 నాటికి ముంబై-అహ్మదాబాద్ పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది’ అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.
Also Read
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
- TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
- SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
Also Read: Vijay Sethupathi-Vote: మత రాజకీయాలు చేసే వారికి ఓటు వెయ్యొద్దు.. విజయ్ సేతుపతి వీడియో వైరల్!
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్న అహ్మదాబాద్-ముంబై మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. ఇది అందుబాటులోకి వస్తే.. 2.58 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. 2028 నాటికి అహ్మదాబాద్-ముంబై పూర్తి మార్గం అందుబాటులోకి రానుంది. జపాన్ షింకన్సెన్ టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తోంది. రూ.1.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.
తాజావార్తలు
-
AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
-
Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!