Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ..
- కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన కేంద్రానికి లేదు
- విశాఖ రైల్వే జోన్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్ స్థలం కేటాయించారని, త్వరలోనే జోన్ పనులు ప్రారంభం చేస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ సమావేశంలో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను ఇప్పటివరకు సత్తుపల్లి వరకు పూర్తి అయ్యింది మిగతాది అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బీపీసీల్ కంపెనీ 70 కోట్ల రూపాయల ప్రాజెక్టును వేరే రాష్ట్రంలో పెట్టాలనుకున్న దానిని మన రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. ఆర్ అండ్ ఆర్ నిర్వాసితులను దృష్టిలో పెట్టుకొని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహం చేస్తామన్నారు.
Read Also: CM Chandrababu: పదవులను బాధ్యతగా భావించాలి.. నామినేటెడ్ పదవులు పొందిన వారికి సీఎం సూచన
Also Read
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకున్న ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో భవిష్యత్తులో ఎలాంటి ప్రాబ్లం రాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉంది కానీ దానిని కాపాడుకునే బాధ్యత భారత జనతా పార్టీ తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో విశాఖ ఉక్కు పరిశ్రమ ఎటువంటి ప్రాబ్లం లేకుండా దాన్ని కాపాడుకునే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాలలో పనులు కుంటుబడ్డాయన్నారు. కూటమి ప్రభావం అధికారంలోకి వచ్చాక రెండు నెలలు నుండి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందన్నారు. 15 వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడం జరిగిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాబోయే రోజులు ఎన్ని వేల కోట్లయినా ఇవ్వడానికి ప్రధానమంత్రి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!