Union Minister Pemmasani Chandrasekhar: రాజకీయ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి.. త్వరలోనే అభివృద్ధి పనులు పట్టాలెక్కిస్తా..
- కొన్ని అభివృద్ధి పనులకు రాజకీయ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి..
- కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు..
- త్వరలోనే అన్ని అభివృద్ధి పనులు పట్టాలెక్కుతాయని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Pemmasani Chandrasekhar: కొన్ని అభివృద్ధి పనులకు రాజకీయ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే అన్ని అభివృద్ధి పనులు పట్టాలెక్కుతాయన్నారు.. రాష్ట్రంలో పారదర్శకత, భాధ్యతతో కూడిన పాలన సాగించాలన్న ఆలోచనతో ఉన్నాం.. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించాల్సిన బ్రిడ్జిలు ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కొంత సమయం పడుతుందన్నారు.. రెండు మూడు నెలల్లో అన్నీ పనులు అయిపోవాలంటే, జరిగే పని కాదన్న ఆయన.. కొన్ని అభివృద్ధి పనులకు రాజకీయ పరిస్థితులు అడ్డుపడుతున్నాయి అంటూ హాట్ కామెంట్లు చేశారు.
Read Also: Committee Kurrollu: ఆగష్టు 9న థియేటర్లలోకి వచ్చేస్తున్న కమిటీ కుర్రోళ్లు..
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
గతంలో ప్రభుత్వ హాస్పిటల్ తో పాటు, గుంటూరులో నిర్మించాల్సిన రైల్వే బ్రిడ్జిలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు పెమ్మసాని.. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో గడిచిన సమీక్షలో మా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించామన్న ఆయన.. ప్రస్తుత వర్షాకాల పరిస్థితులు, వ్యవసాయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. గుంటూరులో నిర్మించాల్సి ఉన్న పలు రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై కూడా సమీక్ష సాగింది త్వరలోనే అన్ని అభివృద్ధి పనులు పట్టాలెక్కుతాయన్నారు పెమ్మసాని చంద్రశేఖర్.
Read Also: G. Kishan Reddy: మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలు..
ఇక, జగన్ రోడ్డు మీదకు వస్తే ఏపీ అభివృద్ధి నిలిచిపోతుందని సూచించారు పెమ్మసాని.. వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన హత్య.. అది రాజకీయ హత్య కాదన్నారు. మాచర్లలో తోట చంద్రయ్య హత్య, రాజకీయ హత్య… ఆరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? అని ప్రశ్నించారు. మాచర్ల ప్రాంతంలో ఒక మనిషి ప్రాణాలు తీసేస్తే పరామర్శించాలి కదా..? అని నిలదీశారు. జగన్ వల్ల ఢిల్లీలో తెలుగు వాళ్ల పరువు పోతుందన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా జగన్ పై సరైన అభిప్రాయం లేదన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్.
తాజావార్తలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..