Kisan Reddy: నవంబర్ 14 బాలల దినోత్సవం మార్చాలి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం
- సాహిబ్జాదా జొరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్లకు ఘన నివాళులర్పించిన కిషన్ రెడ్డి
- డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్గా గుర్తించడం వారి త్యాగానికి, ధైర్యానికి ఘన నివాళి- కిషన్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భారతీయ సాహసయోధులైన సాహిబ్జాదా జొరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్లకు ఘన నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 1500 ఏండ్ల క్రితం భారతీయత కోసం, ధర్మం కోసం పదవ సిక్కు గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులైన.. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ బలిదానమయ్యారని తెలిపారు. డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్గా గుర్తించడం వారి త్యాగానికి, ధైర్యానికి ఘన నివాళి అని అన్నారు.
Read Also: Ram Charan : గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ సేల్స్ సూపర్
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ఆ వీరపుత్రులకు ఘన నివాళులర్పిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. వారిద్దరు సిక్కుల పథానికి, ధర్మానికి అంకితమై తమ ప్రాణాలను అర్పించి చిన్న వయసులోనే అమరులైన వీరులు అని కొనియాడారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14న బాలల దినోత్సవం జరుపుకుంటాం.. అదేవిధంగా డిసెంబరు 26న వీర్ బాల్ దివస్ వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు. ప్రధానమంత్రి మోడీ వీర్ బాల్ దివస్ను యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారని పేర్కొన్నారు.
Read Also: NALCO Recruitment 2024: నాల్కోలో 518 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇలా
డిసెంబరు 2022లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వీర్ బాల్ దివస్ కార్యక్రమాలు మొదటి సారిగా నిర్వహించబడ్డాయని కేంద్రమంత్రి తెలిపారు. సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్ల ధైర్యం, త్యాగాలకు నివాళి అర్పించడం జరిగిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం.. ఆ రోజుకు బాలల దినోత్సవం జరుపుకోవడానికి సంబంధం లేదని అభిప్రాయపడ్డారు. మార్చాల్సిన అవసరం ఉంది.. డిసెంబర్ 26 చిల్డ్రన్ డే జరుపుకోవడానికి సరైన రోజని కిషన్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!