Kishan Reddy: కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేస్తాం..
- కేంద్ర ప్రభుత్వ రోజ్ గార్ మేళా
- హైదరాబాద్లో నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- తెలంగాణలో 155 మందికి నియామక పత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వ రోజ్గార్ మేళాలో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను ప్రధాని, కేంద్ర మంత్రులు నేడు అందజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 155 మందికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. 10 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా.. ఒక్క పోస్టల్ డిపార్ట్ మెంట్లోనే 119 మందికి నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడానికి యువశక్తిని వినియోగించుకోవడం అవసరమన్నారు. 2047 వరకు వికసిత భారత్ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలన్నారు. అనేక కంపెనీలకు మన వాళ్ళు సీఈఓలుగా ఉన్నారని తెలిపారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం.. మాతృ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఏది కనుగొన్నా దానిలో భారతీయుల మేధస్సు ఉందని తెలిపారు. 75 దేశాలకు డిఫెన్స్ పరికరాలు ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పారు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Read Also: Tirupati Crime: అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ అనుమానాస్పద మృతి
ఈ రోజు ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యక్రమాలు లేకుండా ఐఎస్ఐ మూలాల్ని ఉక్కుపాదంతో అణచి వేశామని వెల్లడించారు. విద్యుత్ మిగులు ఉన్న నూతన భారత్ను మోడీ ఆవిష్కరించారన్నారు. పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుండి మొదలు పెడితే చంద్రయాన్ వరకు అన్నింటి పైన మోడీ సర్కార్ దృష్టి పెట్టిందన్నారు. యువశక్తి లేని దేశం అభివృద్ధి చెందడం కష్టం… వచ్చే 25 ఏళ్లు ఇండియాకి అమృత కాలమని తెలిపారు. 25 ఏళ్ల తర్వాత దేశంలో యువత తగ్గిపోతుందన్నారు. ఈ దేశాన్ని, తల్లిదండ్రులను, సొంత గ్రామాన్ని, మాతృ భాషను మరవకండి అంటూ యువతకు కేంద్రమంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కేంద్ర మంత్రులు దీపావళి సైనికులతో జరుపుకోవాలని ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చారని.. తాను వెళ్తున్నానని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!