Bandi Sanjay Kumar: ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదు.. బీసీలకు అన్యాయం చేసింది..!
- నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి?
- మావోయిస్టులపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి రెండు నాల్కల ధోరణి
- రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదు
- కేవలం సర్వే మాత్రమే జరిపింది
- బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay Kumar: గోదావరి ఖనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నక్సల్స్, కాంగ్రెస్ పార్టీ వైఖరి, కులగణన తదితర అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి? అంటూ ప్రశ్నించారు. వారు దశాబ్దాలుగా నక్సల్స్ పక్షాన నిలబడి, అమాయకుల చావులకు కారణమైన విధానాలకు మద్దతు ఇస్తున్నారు. ఆ చావులకు మీరు ఏమి సమాధానం చెబుతారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Addanki Dayakar: రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యం..!
Also Read
- India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Makkah Deal: మక్కా ఒప్పందంలోకి బంగ్లాదేశ్! భారత్పై జమాతే ఇస్లామీ నాయకుడు కీలక వ్యాఖ్యలు
అలాగే, మావోయిస్టులపై కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న దుర్బుద్ధి వైఖరి రెండు నాలుకల ధోరణికి నిదర్శనం. ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని చెప్పుకుంటూ, మరోవైపు తుపాకీతో అమాయకులను చంపుతున్న వారిని సమర్థించడం సరికాదని స్పష్టం చేశారు. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటి? దశాబ్దాలుగా జరిగిన హత్యలు మర్చిపోయారా? మావోయిస్టులు తుపాకీ వదిలి లొంగిపోవాలి. ప్రజల మధ్య కలవాలని బండి సంజయ్ అన్నారు. అలాగే పౌర హక్కుల సంఘాలనూ ఉద్దేశించి, మీరు నిజంగా ప్రజల పక్షాన ఉంటే, నక్సల్స్ కు నచ్చజెప్పండి.. మార్గం తప్పకుండా సూచించండి అని వ్యాఖ్యానించారు.
Read Also: Nandamuri Balakrishna: బాలయ్య సీరియస్ వార్నింగ్.. వాళ్ల జోలికి వస్తే ఖబర్దార్..
కులగణన అంశంపై మాట్లాడిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదు.. కేవలం సర్వే మాత్రమే. బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది అని ధ్వజమెత్తారు. ప్రతి ఇంటికి వెళ్లి కచ్చితంగా నిర్వహించేది కులగణనే. రాష్ట్రం చేసినది అసంపూర్ణం. కానీ, మోడీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో జనగణన ప్రక్రియలో భాగంగా కులగణన చేస్తుంది. ఇది బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేలా ఉంటుంది అని తెలిపారు.
తాజావార్తలు
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
-
India Post GDS : పదో తరగతితో పోస్ట్ఆఫీస్ జాబ్.. 25 వేలకుపైగా పోస్టులు
-
Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!