Cyber Crime: సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్.. రూ.5489 కోట్లు స్వాధీనం
- సవాల్ గా మారుతున్న సైబర్ నేరాలు
- కౌంటర్ అటాక్ చేస్తున్న సైబర్ కమాండోస్
- సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్ల స్వాధీనం
- 12 లక్షలకుపైగా మొబైల్స్ బ్లాక్
- 13 లక్షలకుపైగా బ్యాంకు అకౌంట్ల సీజ్
- మహిళలు, చిన్నారులు లక్ష్యంగా సాగే ఆన్లైన్ నేరాలపై ప్రత్యేక దృష్టి- కేంద్ర హోంశాఖ
ఢిల్లీ – దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఒకవైపు సైబర్ నేరాలను అడ్డుకుంటూనే మరోపక్క నేరస్థుల నుంచి రికవరీలు కూడా చేస్తున్నారు. దేశంలో సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ జరిగింది. అయితే రికవరీ అయిన సొమ్మును బాధితులకు రీఫండ్ చేసే విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సులభతరం చేసే అంశంపై కేంద్రం యోచిస్తోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుల్లో సైబర్ కమాండోల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని హోంశాఖ చెబుతోంది. సైబర్ నేరాలపై పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించే ప్రధాన కేంద్రంగా ఐ4సీ పనిచేస్తోంది.
Also Read:TTD: శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసం.. హైదరాబాద్ భక్తుడి వద్ద రూ. 90 వేలు వసూలు
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
సైబర్ మోసాల బాధితుల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేయడమే కాకుండా, 12 లక్షలకుపైగా సిమ్లు, మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసినట్లు చేశారు. మరోపక్క రూ.4631 కోట్లు విలువైన మోసపూరిత లావాదేవీలను అడ్డుకున్నారు. సైబర్ మోసాల్లో డబ్బు తరలించడానికి వాడే బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేస్తున్నారు. నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో నమోదు అయ్యే సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం ఢిల్లీ పోలీసులు e-zero FIR విధానాన్ని అమలు చేస్తున్నారు. ఢిల్లీ విధానంలో అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమలు చేసేలా అధికారులు ప్లాన్ చెయ్యాలని హోంశాఖ చెప్తొంది.
Also Read:Mulugu: ములుగు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
భారత్ లో సైబర్ నేరాలను అరికట్టడంలో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) కీలకంగా వ్యవహరిస్తోంది. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP), 1930 – సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (CFCFRMS), సైబర్ మల్టీ ఏజన్సీ సెంటర్ (CyMAC), రిపోర్ట్ & చెక్ సస్పెక్ట్ సౌకర్యం, సస్పెక్ట్ రిజిస్ట్రీ, సమన్వయ్ ప్లాట్ఫాం, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, సైబర్ కమాండోల ద్వారా సైబర్ నేరాల నియంత్రణ కోసం పనిచేస్తున్నాయి.కేంద్ర రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, న్యాయమూర్తుల సామర్ధ్యాల అభివ్రుద్ధికి సైతం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. సోషల్ మీడియా, పత్రికలు, ప్రసార్ భారతి, ఆకాశవాణి ద్వారా సైబర్ మోసాలపై ప్రజలకు విస్త్రత అవగాహన కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు. 1930 నంబర్ ను సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ హెల్ప్లైన్ గా ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!